తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ జనాలందరూ టీవీ సెట్లకు అతుక్కుపోయి మరీ గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ అధిపత్యంగా స్పష్టంగా కనిపిస్తుండగా బిఆర్ఎస్ ఊహించిన దాని కన్నా తక్కువ స్థాయిలో నిలవడం అందరికీ షాక్ కలిగిస్తోంది. ఏపీలోనూ ఈ పరిణామాల పట్ల సాధారణ జనాలు తీవ్ర పరిశీలన చేస్తున్నారు. దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఈ హడావిడి కొత్త సినిమాల థియేటర్ల కలెక్షన్ల మీద ఏమంత ప్రభావం చూపించడం లేదని అర్థమైపోతోంది. ముఖ్యంగా బాక్సాఫీస్ ని పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చుకున్న యానిమల్ ఇవాళ కూడా రచ్చ చేస్తోంది.
ప్రధాన కేంద్రాలతో పాటు బిసి సెంటర్స్ లోనూ రన్బీర్ వీరంగం జోరుగా ఉంది. ఆదివారం కావడంతో ముఖ్యమైన థియేటర్లన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అవుతున్నాయి. కౌంటర్ల దగ్గరకు వెళ్లినవాళ్లకు ముందు వరస సీట్లు తప్ప టికెట్లు దొరికే పరిస్థితి లేదు. హైదరాబాద్ లో ఇవాళ కూడా ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచే షోలు ప్రారంభిస్తున్నారు. మూడున్నర గంటల నిడివి కావడంతో ఎక్కువ షోలు వేసుకోవాలంటే వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ప్రతి ఆటకు కనీసం పావు గంట గ్యాప్ లేనిదే క్లీనింగ్ చేసుకోవడం కష్టం. కొన్ని చోట్ల అది కూడా సాధ్యం కాక వదిలేస్తున్నారు.
ఇవాళ ఏపీ తెలంగాణలో యానిమల్ లాభాల్లోకి అడుగు పెట్టే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మొదటిరోజే సగానికి పైగా షేర్ రూపంలో రాబట్టిన యానిమల్ కేవలం మూడు రోజులకే ఇంత పెద్ద ఫిగర్లు నమోదు చేయడం ఊహించని పరిమాణం. 15 కోట్లకు కొన్న దిల్ రాజుని మొదట రిస్క్ అనుకున్నారు కానీ ఇప్పుడాయనకు రాబోయే లాభాలు చూస్తే ఇతర డిస్ట్రిబ్యూటర్లకు నిద్ర దూరం కావడం ఖాయం. అయితే ఈ జోరు రేపటి నుంచి ఏ స్థాయిలో కొనసాగుతుందనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ డ్రాప్ కనక 40 శాతం లోపే ఉంటే జవాన్, పఠాన్ రికార్డులు ఎగిరిపోవడం ఖాయమే.
This post was last modified on December 3, 2023 1:14 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…