ఒక్కోసారి సుడి ఉంటే తన్నుకొచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. దాన్నే ఇంకో రకంగా శుక్రమహర్దశని చెప్పొచ్చు. దిల్ రాజు కంటే మంచి ఉదాహరణ ఇంకోటి అక్కర్లేదు. ‘యానిమల్’ హక్కులను తెలుగు రాష్ట్రాలకు 15 కోట్లకు కొన్నప్పుడు అందరిలోనూ ఒకలాంటి అనుమానం. ఏ మాత్రం తేడా కొట్టినా రన్బీర్ కపూర్ ని మన ఆడియన్స్ తిరస్కరిస్తారు. కట్ చేస్తే మొదటి వీకెండ్ దాటడం ఆలస్యం లాభాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా నైజామ్ లో యానిమల్ భీభత్సం మాములుగా లేదు. అయితే దిల్ రాజు హవా గత కొంత కాలంగా దివ్యంగా వెలిగిపోతున్న విషయం గమనించాలి .
‘జైలర్’ కీలక ప్రాంతాలకు పంపిణి చేసింది ఆయనే. ఇది కలలో కూడా ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎప్పుడో మార్కెట్ తగ్గిపోయిన రజనీకాంత్ కి తిరిగి తెలుగులో బిజినెస్ పెరిగేలా చేసింది. అంతకు ముందు ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాలు ఇక్కడ అంచనాలు అందుకోలేకపోయినా దిల్ రాజు పెట్టుబడికి ఢోకా లేకుండా వెనక్కు తెచ్చింది. ‘లవ్ టుడే’ని తెలివిగా రీమేక్ చేయకుండా అనువాదం చేయడం లాభాల వర్షం కురిపించింది. ఇవన్నీ స్ట్రెయిట్ సినిమాలు కాదు. ఏ మాత్రం వర్కౌట్ కానీ ‘సప్తసాగరాలు దాటి’ లాంటివి ట్రై చేయకపోవడం దిల్ రాజు తెలివికి నిదర్శనం.
వీటి తాలూకు ఆనందం ఈ అగ్ర నిర్మాతలో స్పష్టంగా కనిపిస్తోంది. గేమ్ చేంజర్ విపరీతంగా ఆలస్యం కావడం, సంక్రాంతికి అనుకున్న ఫ్యామిలీ స్టార్ ని మార్చికి వాయిదా వేయాల్సి రావడం లాంటివి ఇబ్బంది పెట్టినా ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఫుల్ స్వింగ్ లో ఉన్న మాట వాస్తవం. ఇతర నిర్మాతలు చేసిన మసూద, బింబిసార లాంటి బ్లాక్ బస్టర్లు దిల్ రాజుకు కామధేనువే అయ్యాయి. యానిమల్ ఫైనల్ ఫిగర్స్ మాత్రం ఖచ్చితంగా వామ్మో అనిపించేలా ఉంటాయి. సలార్ కి పోటీ పడకుండా మైత్రికి వదిలేయడం ఎంత వరకు సబబో డిసెంబర్ 22 నాడు తేలిపోతుంది. చూద్దాం.
This post was last modified on December 2, 2023 10:33 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…