డిసెంబర్ నెలలో మాములుగా ఎంత పెద్ద హీరో సినిమా అయినా భీభత్సమైన వసూళ్లు రాబట్టుకోవడం కష్టం. అందుకే ఒకవేళ ప్లాన్ చేసుకున్నా క్రిస్మస్ టైంలో చూసుకుంటారు కానీ మొదటి వారం కాదు. అయినా సరే యానిమల్ ఈ సెంటిమెంట్ బ్రేక్ చేసి నిన్న వరల్డ్ వైడ్ భారీ ఓపెనింగ్ దక్కించుకుని ఔరా అనిపించుకుంది. టైటిల్ కి న్యాయం చేస్తూ వసూళ్ల మృగం పేరుకి సార్థకత చేకూరుస్తోంది. టీమ్ అధికారికంగా విడుదల చేసిన ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ 116 కోట్లు రావడమంటే మాటలు కాదు. అందులోనూ ప్రతికూల పరిస్థితులు, సామ్ బహదూర్ లాంటి పోటీని పెట్టుకుని.
కేవలం ఇండియానే పరిగణలోకి తీసుకున్నా 61 కోట్లకు రావడమంటే సెన్సేషన్ కన్నా ఎక్కువ. ఒక్క హిందీ వెర్షనే హాఫ్ సెంచరీ దాటడం సంచలనం. తర్వాత అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి 10 కొట్లకు దగ్గరగా వచ్చినట్టు ట్రేడ్ టాక్. పదిహేను కోట్లకు కొన్న దిల్ రాజు పంట పండినట్టేనని బయ్యర్ల మాట. విచిత్రంగా తమిళం, కన్నడ, మలయాళం నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాలకు కలిపి 60 లక్షల లోపే రావడం గమనార్హం. ఓవర్సీస్ లో చాలా సులభంగా రెండున్నర మిలియన్లు దాటేసిన యానిమల్ క్లోజింగ్ ఫిగర్స్ షాకింగ్ ఉండబోతున్నాయి.
ఈ దూకుడు కొనసాగడం మీదే యానిమల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. శని ఆదివారాలు కూడా ఉదయం ఎర్లీ షోలు వేయడం ట్రెండ్ ని సూచిస్తోంది. కొన్ని చోట్ల జవాన్ కు దగ్గరగా వెళ్లడం, క్రాస్ చేయడం అనూహ్యం. అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ చాలా కేంద్రాల సింగల్ స్క్రీన్లలో పద్దెనిమిది లోపు టీనేజ్ కుర్రకారు థియేటర్ల దగ్గర కనిపిస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో వీళ్ళను అనుమతించనప్పటికీ యూత్ ఆడియన్స్, మాస్ అండతో భారీ ఫిగర్లు నమోదవుతున్నాయి. ఇవాళ 70 కోట్ల దాకా అంచనా ఉంది. మొదటి వారం పూర్తయ్యేలోపే డబుల్ సెంచరీ ఖాయమేనని చెప్పొచ్చు.
This post was last modified on December 2, 2023 1:01 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…