ప్రభాస్ ఫ్యాన్సే కాదు సగటు మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సలార్ ట్రైలర్ వచ్చేసింది. షూటింగ్ లో ఉన్నన్నాళ్ళు కేవలం లీకైన పిక్స్ తో సంతృప్తి చెందిన అభిమానులు టీజర్ లో తమ హీరో ముఖం చూపించకుండా డైనోసర్ అంటూ పని కానివ్వడంతో అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. హోంబాలే ఫిలిమ్స్ ముందే ప్రకటించినట్టు సరిగ్గా 7 గంటల 19 నిమిషాలకు రిలీజ్ చేశారు. డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేని నేపథ్యంలో హైప్ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. పైగా కెజిఎఫ్ ప్రశాంత్ నీల్ తోడవ్వడంతో అంచనాలు మాములుగా లేవు. మూడు నిమిషాలకు పైగా వీడియోలో క్లూస్ ఇచ్చారు.
ఈ కథ వెయ్యేళ్ళ క్రితమే మొదలవుతుంది. మొహమ్మద్ గజిని కాలం నుంచి ఆధిపత్య పోరులో తెగలు యుద్ధాలు చేసుకున్న తర్వాత ఖన్సార్ అనే పెద్ద నగరం ఉద్భవిస్తుంది. దానికి వారసుడిగా వరదరాజ మన్నార్(పృథ్విరాజ్ సుకుమారన్)కి పట్టం కట్టాలని చూస్తుంటాడు తండ్రి రాజ మన్నార్(జగపతిబాబు). అయితే శత్రువుల కుట్ర వల్ల చేజారిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రాణ స్నేహితుడు దేవా(ప్రభాస్)ని పిలుస్తాడు వరదరాజ. అక్కడి నుంచి అసలు ఊచకోత మొదలవుతుంది. అతను సృష్టించే విధ్వంసానికి పునాదులు కదులుతాయి. అదే సీజ్ ఫైర్.
ఊహాతీత యాక్షన్ ప్రపంచంలోకి దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి తీసుకెళ్లాడు. డార్క్ టోన్ మనకు కెజిఎఫ్ లోనే పరిచయం చేసినా ఇందులో చూపించిన విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ప్రభాస్ లో కసిని కోపాన్ని పూర్తిగా ఆవిష్కరించిన విధానం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. రవి బస్రూర్ నేపధ్య సంగీతం ఎలివేషన్లని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.ప్రభాస్ చెప్పిన డైలాగులు విజిల్స్ వేయించే స్టఫ్ ఇస్తున్నాయి. మొత్తానికి సలార్ నుంచి ఏం కోరుకుంటున్నామో దాన్ని ఇచ్చేలా చేయడం నీల్ సక్సెస్ అయ్యాడు. ఇంతే స్థాయిలో మొత్తం సినిమా ఉంటే రికార్డుల అడ్రెస్ గల్లంతే.
This post was last modified on December 1, 2023 7:43 pm
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…