Movie News

తలలు నరికే ఊర మాస్ ‘రత్నం’

ఒకప్పుడు పందెం కోడి, పొగరు లాంటి సూపర్ హిట్లతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న విశాల్ కు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో హిట్టు లేకుండా పోయింది. తమిళంలో వంద కోట్లు సాధించిన మార్క్ ఆంటోనీ సైతం మన దగ్గర బోల్తా కొట్టడం విచిత్రం. అభిమన్యుడు తప్ప చాలా కాలం నుంచి సక్సెస్ అందని ద్రాక్షే అయ్యింది. తాజాగా రత్నంగా వస్తున్నాడు. సింగం లాంటి మాస్ పోలీస్ కథలతో మెప్పించిన దర్శకుడు హరితో చేతులు కలిపాడు. ఇందాక కాన్సెప్ట్ ని పరిచయం చేసే రెండు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ ని రిలీజ్ చేశారు. 2024 వేసవిలో రత్నం రానుంది.

ఒక పెద్ద మైదానంలో దున్నపోతులు, గుర్రాలు పరిగెడుతూ ఉండగా వాటి మధ్య లారీ నుంచి దిగి తన కోసం ఎదురు చూస్తూ మోకాలి మీద కూర్చున్న ఒక దుండగుడి తల నరికి దాన్ని చేత్తో పట్టుకుని విశాల్ నడిచి వచ్చే సీన్ ని ఈ వీడియోలో చూపించారు. కథను రివీల్ చేయలేదు కానీ విశాల్ చాలా గ్యాప్ తర్వాత ఊర మాస్ ఫ్యాక్షన్ స్టోరీ చేసినట్టు కనిపిస్తోంది. మాములుగానే దర్శకుడు హరిది లౌడ్ హీరోయిజం. గట్టి గట్టిగా కేకలు వేయిస్తూ, సవాళ్లు విసిరిస్తూ హీరో విలన్ మధ్య డ్రామాని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారు. రత్నం కూడా అదే స్టైల్ లోనే ఉండబోతోందని అర్ధమవుతోంది.

విశాల్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. లాఠీ, సామాన్యుడు, ఎనిమి, చక్ర, యాక్షన్ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో ఆశలన్నీ రత్నం మీదే పెట్టుకున్నాడు. మిస్కిన్ తో గొడవపడి ఆపేసిన డిటెక్టివ్ 2ని త్వరలో తన స్వీయ దర్శకత్వంలోనే ప్లాన్ చేసుకున్నాడు. మన దగ్గర పట్టు తప్పినా త్వరలో రత్నంతో కంబ్యాక్ అవ్వొచ్చని నమ్ముతున్నాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యాక్షన్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సముతిరఖని, గౌతమ్ మీనన్., యోగిబాబు ఇతర తారాగణం. తీవ్రమైన పోటీ ఉండటంతో రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు.

This post was last modified on December 1, 2023 5:43 pm

Share

Recent Posts

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

10 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

10 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

4 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

4 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

5 hours ago