నిన్న సాయంత్రం నాగచైతన్య డిజిటల్ డెబ్యూ వెబ్ సిరీస్ దూతని హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సెలబ్రిటీలు, కొందరు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో పాటు టీమ్ మొత్తం అక్కడే ఉంది. సహజంగానే టాక్ ఎలా ఉందనే కుతూహలం ఫ్యాన్స్ లో కలగడం సహజం. చైతు మొదటిసారి ఓటిటి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సినిమా రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే అమెజాన్ ప్రైమ్ చాలా విస్తృతంగా ప్రమోషన్లు చేయడం బాగా ప్లస్ అవుతోంది.
ఇక టాక్ సంగతి చూస్తే నిన్న చూపించింది కేవలం రెండు ఎపిసోడ్లు మాత్రమే. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో క్రాస్ వర్డ్స్ పజిల్స్ మీద విపరీతమైన ఆసక్తి చూపించే క్యారెక్టర్ లో నాగ చైతన్య చాలా కొత్తగా ఉన్నాడు. అధిక శాతం షూట్ రాత్రి, వర్షం ఎఫెక్ట్స్ లో తీయడం వల్ల విభిన్నమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఎపిసోడ్ కొక షాకింగ్ ఎలిమెంట్ తో విక్రమ్ కె కుమార్ చాల ఇంటెన్స్ విజువల్స్ ని ప్రెజెంట్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ కు తీసుకెళ్లే మలుపులు కట్టిపడేసేలా ఉన్నాయి. అయితే ఇంకా బ్యాలన్స్ చాలా ఉంది కాబట్టి బాగుందా బాలేదా అనేది కేవలం దీన్ని బట్టి నిర్ణయించడం కష్టం.
దూత ఇవాళ అర్ధరాత్రి లేదా దానికి కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్ జరిగే అవకాశం ఉంది. తండేల్ రెగ్యులర్ షూటింగ్ ని పెండింగ్ లో పెట్టి మరీ ప్రమోట్ చేసుకున్న చైతు దీంతో ఒక కొత్త బ్రేక్ దొరుకుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. కాకపోతే రేపు యానిమల్ హడావిడి ఎక్కువగా ఉంది కాబట్టి దూత వైపు జనాలు మెల్లగా కన్నేసేలా ఉన్నారు. అయినా థియేటర్ మూవీ కాదు కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు తాపీగా చూసే ఛాన్స్ ఉంది. కాన్సెప్ట్ చూస్తుంటే ఎనిమిది ఎపిసోడ్ల మీద ఆసక్తి కలిగేలా విక్రమ్ ప్రెజెంట్ చేశారు. అంచనాలు నిలబెట్టుకుంటే ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో హిట్టు కొట్టొచ్చు
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…