తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు గురువారం ఉదయాన్నే పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు. సినీరంగంలో లబ్ధ ప్రతిష్ఠులుగా ఉన్న హీరోలు, ఇతరనటులు, సంగీత దర్శకులు కూడా పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబం జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేశారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న చిరంజీవి.. సతీమణి సురేఖ, కుమార్తెతో కలిసి.. పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవిని అప్పయ్య దీక్షలో చూసిన అభిమానులు.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు రాగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. తన సతీమణి, మాతృమూర్తితో కలిసి ఉదయాన్నే పోలింగ్ బూత్ వద్ద దర్శన మిచ్చారు. వీరు కూడా.. లైన్లో నిలబడిఓటు హక్కు వినియోగించుకున్నారు. విక్టరీ హీరో వెంకటేష్.. కూడా ఓటు వేసినట్టు తన ఇన్స్టాలో ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన పోస్టు చేశారు.
అల్లు అర్జున్ కొద్దిసేపు పోలింగ్ బూత్ వద్ద సందడి చేశారు. తనను చూసేందుకు వచ్చిన వారిని ఆయన పలకరించారు. కొందరితో సెల్ఫీలు కూడా దిగారు. క్యూలైన్లో నిలబడిన వృద్ధులకు ఆయన ముందు అవకాశం ఇస్తూ.. తాను వెనక్కి వచ్చారు. చాలా సేపు క్యూలైన్ వద్దే ఉండి.. పరిస్థితిని ఆయన గమనించడం విశేషం. ఇక, సంగీత దర్శకుడు కీరవాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకోవడం.. ప్రతి ఒక్కరి కర్తవ్యమని చెప్పారు.
This post was last modified on November 30, 2023 9:35 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…