డిసెంబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో వరసగా రాబోతున్న హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లకు ఊహించని పరిణామాలు తలెత్తుతున్నాయి. ఎప్పుడూ లేనిది తెలుగు రాష్ట్రాల్లో రన్బీర్ కపూర్ డబ్బింగ్ సినిమా సినీ ప్రియులకు వైరల్ ఫీవర్ లా అంటుకుంది. ఇదేదో సోషల్ మీడియా ట్రెండ్స్ చూసి అంటున్న మాట కాదు. బుకింగ్స్ యాప్స్ ఓపెన్ చేసి ఏ ఊరుని సెలెక్ట్ చేసుకుని చూసినా తెల్లవారుఝామున ఆరు గంటల ఆటకు సైతం ఫాస్ట్ ఫిల్లింగ్స్ కనిపిస్తున్నాయి. మూడు గంటల ఇరవై రెండు నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నా సరే సందీప్ వంగా ఎమోషనల్ ప్రపంచాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు.
ఇంత మేనియా ఉండటంతో సహజంగానే నితిన్, నాని సినిమాల మీద అంత ఫోకస్ వెళ్లడం లేదు. హాయ్ నాన్న షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ట్రైలర్ చూశాక మాస్ లో ఇది మాకు కాదేమోనని అభిప్రాయం కలగడం బజ్ మీద ప్రభావం చూపిస్తోంది. ఇక ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కోసం మొన్నటి దాకా షూటింగ్ చేస్తూనే ఉన్న నితిన్ హఠాత్తుగా ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఎంటర్ టైన్మెంట్ ప్లస్ యాక్షన్ రెండూ ఉన్నాయనే భరోసా ఇచ్చారు కానీ దాన్ని జనం దాకా తీసుకెళ్లడానికి సరిపడా టైం నితిన్ దగ్గర లేదు. హీరోయిన్ శ్రీలీల సైతం ఇంకా యాక్టివ్ గా పబ్లిసిటీలో భాగం కావాల్సి ఉంది.
డిసెంబర్ 1 ఉదయం యానిమల్ షో అయ్యాక కానీ రిలాక్స్ అవ్వాలో వద్దో నితిన్, నానిలు నిర్ణయించుకోలేరు. ఎందుకంటే అర్జున్ రెడ్డి టాక్ వస్తే మాత్రం సందీప్ వంగాని నిలువరించడం కష్టం. ఒకవేళ హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు దాన్ని మించి ఉన్నాయనిపించుకుంటే అప్పుడు లెక్క వేరుగా ఉంటుంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే యానిమల్ లాగా వీటికి అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ రాదు. సో ఫ్యామిలీస్ ఛాయస్ గా పెట్టుకుంటాయి. అలా అని మాస్, యూత్ మద్దతు దక్కకపోతే కష్టం. చూస్తుంటే ఏడాది చివరి బాక్సాఫీస్ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి
This post was last modified on November 29, 2023 7:25 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…