ఎప్పుడెప్పుడు ఇరవై నాలుగు రోజులు గడిచిపోతాయా అని ప్రభాస్ ఎదురు చూస్తున్న సలార్ విడుదల దగ్గరగా వస్తోంది. దీనికన్నా ముందు డిసెంబర్ 1న రాబోయే ట్రైలర్ మీద దేశవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్నో నెలల తర్వాత ఒక బాలీవుడ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు అవేంటో చూద్దాం. సలార్ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. కలిసి పెరిగిన వీళ్ళు బద్ద శత్రువులుగా మారేందుకు పరిస్థితులు ప్రేరేపిస్తాయి. పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో ఫ్రెండ్స్ కి సంబంధించిన సగం కథ మాత్రమే చెప్పబోతున్నారు.
ఇందులోనూ బలమైన ఎమోషన్ ఉంటుంది. నీల్ ఎప్పుడూ యాక్షన్ లో భావోద్వేగాలను రాబట్టుకోలేదు. కథ డిమాండ్ చేసిన ప్రకారం హృదయాన్ని తాకేలా అవసరమైనప్పుడే వాడతారు. అది తల్లి, తమ్ముడు, అన్నయ్య, బంధువు ఇలా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కెజిఎఫ్, సలార్ రెండూ ఒకదానితో మరొకటి సంబంధం లేని ప్రపంచాలు.మొదలైన కాసేపటికే దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ట్రైలర్ చూశాక ఒక ఖచ్చితమైన అంచనాకు వచ్చేస్తారు. ప్రభాస్ వ్యక్తిత్వానికి ముగ్దుడు కావడం వల్లే తాను అనుకున్న దానికన్నా గొప్పగా సలార్ ని తెరకెక్కించారట ప్రశాంత్ నీల్.
సెకండ్ పార్ట్ షూటింగ్ వీలైనంత త్వరగా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఫలానా డేటు, నెలని చెప్పడం లేదు. దానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. ఆరు గంటల సరిపడా సబ్జెక్టు కావడం వల్లే సలార్ ని రెండు భాగాలు చేయాల్సి వచ్చింది తప్ప కేవలం బిజినెస్ కోసమో, క్రేజ్ ని వాడుకోవడం కోసమో కాదట. స్నేహితులుగా నటిస్తున్న ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ల మధ్య నడిచే ఎపిసోడ్స్ మాములుగా ఉండవని ఊరిస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ చెప్పిన ముచ్చట్లు ఆసక్తి రేపేలా ఉన్నాయి. డంకీ ప్రస్తావన లేకుండా కేవలం సలార్ గురించి మాత్రమే చెప్పిన ఈ గ్రాండియర్ డైరెక్టర్ అంచనాలకు మించి ఏదో చేసేలానే ఉన్నాడు.
This post was last modified on November 28, 2023 9:25 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…