ఎప్పుడెప్పుడు ఇరవై నాలుగు రోజులు గడిచిపోతాయా అని ప్రభాస్ ఎదురు చూస్తున్న సలార్ విడుదల దగ్గరగా వస్తోంది. దీనికన్నా ముందు డిసెంబర్ 1న రాబోయే ట్రైలర్ మీద దేశవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్నో నెలల తర్వాత ఒక బాలీవుడ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు అవేంటో చూద్దాం. సలార్ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. కలిసి పెరిగిన వీళ్ళు బద్ద శత్రువులుగా మారేందుకు పరిస్థితులు ప్రేరేపిస్తాయి. పార్ట్ వన్ సీజ్ ఫైర్ లో ఫ్రెండ్స్ కి సంబంధించిన సగం కథ మాత్రమే చెప్పబోతున్నారు.
ఇందులోనూ బలమైన ఎమోషన్ ఉంటుంది. నీల్ ఎప్పుడూ యాక్షన్ లో భావోద్వేగాలను రాబట్టుకోలేదు. కథ డిమాండ్ చేసిన ప్రకారం హృదయాన్ని తాకేలా అవసరమైనప్పుడే వాడతారు. అది తల్లి, తమ్ముడు, అన్నయ్య, బంధువు ఇలా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కెజిఎఫ్, సలార్ రెండూ ఒకదానితో మరొకటి సంబంధం లేని ప్రపంచాలు.మొదలైన కాసేపటికే దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ట్రైలర్ చూశాక ఒక ఖచ్చితమైన అంచనాకు వచ్చేస్తారు. ప్రభాస్ వ్యక్తిత్వానికి ముగ్దుడు కావడం వల్లే తాను అనుకున్న దానికన్నా గొప్పగా సలార్ ని తెరకెక్కించారట ప్రశాంత్ నీల్.
సెకండ్ పార్ట్ షూటింగ్ వీలైనంత త్వరగా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఫలానా డేటు, నెలని చెప్పడం లేదు. దానికి టైం కూడా ఎక్కువ పడుతుంది. ఆరు గంటల సరిపడా సబ్జెక్టు కావడం వల్లే సలార్ ని రెండు భాగాలు చేయాల్సి వచ్చింది తప్ప కేవలం బిజినెస్ కోసమో, క్రేజ్ ని వాడుకోవడం కోసమో కాదట. స్నేహితులుగా నటిస్తున్న ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ల మధ్య నడిచే ఎపిసోడ్స్ మాములుగా ఉండవని ఊరిస్తున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ చెప్పిన ముచ్చట్లు ఆసక్తి రేపేలా ఉన్నాయి. డంకీ ప్రస్తావన లేకుండా కేవలం సలార్ గురించి మాత్రమే చెప్పిన ఈ గ్రాండియర్ డైరెక్టర్ అంచనాలకు మించి ఏదో చేసేలానే ఉన్నాడు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…