గత ఏడాది మాచర్ల నియోజకవర్గంతో చేదు ఫలితాన్ని అందుకున్న యూత్ హీరో నితిన్ ఈసారి మళ్ళీ తన పాత రూటుకే వచ్చి ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ గా వస్తున్నాడు. భీష్మ లాంటి వినోదాత్మక చిత్రాన్ని ఆభిమానులు ఆశిస్తున్న తరుణంలో సరైన కథను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. రచయితగా స్టార్ స్టేటస్ లో ఉన్న వక్కంతం వంశీకి దర్శకుడిగా నా పేరు సూర్య ఆశించిన రిజల్ట్ ఇవ్వలేకపోయినా ఈసారి బాగా టైం తీసుకుని వినోదం ప్లస్ యాక్షన్ వైపుకు వచ్చేశాడు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్ అట్రాక్షన్. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు.
అభి(నితిన్)కి చిన్నప్పటి నుంచి రోజుకోలాగా కనిపించాలని కోరిక. అదే తల్లి(రోహిణి)తో చెబుతాడు. కొడుకులో యాక్టర్ లక్షణాలున్నాయని గుర్తించి హీరో కమ్మని ప్రోత్సహిస్తుంది. తీరా చూస్తే మనోడు జూనియర్ ఆర్టిస్టు అవుతాడు. రకరకాల గెటప్పులతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే తండ్రి(రావు రమేష్)కి ఎక్కడో కాలుతుంది.జీవితంలో ఏదో ఛాలెంజ్ కావాలని అభి ఎదురు చూస్తున్న టైంలో ఒక ఊరు, దాన్ని పట్టి పీడిస్తున్న ఒక విలన్(సుదేవ్ నాయర్) ప్రవేశిస్తారు. అక్కడి నుంచి రియల్ డ్రామా మొదలవుతుంది. అసలైన ప్రమాదంలో అడుగు పెట్టిన అభి చివరికి ఏం చేశాడో తెరమీద చూడాలి.
దర్శకుడు వక్కంతం వంశీ మంచి వినోదాత్మక రూటు పట్టేశాడు. సన్నివేశాల్లో ట్రెండ్ కు తగ్గ ఫన్ ఉంది. పాదయాత్ర అంటూ షర్మిల చెప్పిన డైలాగ్ ని మిమిక్రి చేయడం, ఫ్యాన్స్ ని బాలయ్య ఎందుకు కొడతాడంటే వెరైటీ సమాధానం చెప్పడం లాంటి బాగా పేలాయి. యాక్షన్ టచ్ కోసం విలన్ ట్రాక్ పెట్టి ఫక్తు రేసు గుర్రం టైపులో ఫుల్ మీల్స్ ప్లాన్ చేసుకున్నాడు వంశీ. హరీష్ జైరాజ్ సంగీతం, ఆర్థర్ విల్సన్ – యువరాజ్ – సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం నిర్వర్తించారు. డిసెంబర్ 8కి సరిపడా హైప్ ని ఎక్స్ ట్రాడినరీగా సృష్టించుకోవడంలో టీమ్ విజయవంతమయ్యింది.చివర్లో రాజశేఖర్ పంచ్ కామెడీ బాగుంది.
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరా జయం పాలైన…