ఇండస్ట్రీలో సినిమాలు వేగంగా చేసే విషయంలో ముందు వరసలో ఉన్నది రవితేజ, నానిలే. జయాపజయాలెలాగూ మన చేతుల్లో ఉండవు కాబట్టి వీలైనంత బిజీగా ఉంటూ యూనిట్లకు పని కల్పించడంలో ముందుంటారు. డిసెంబర్ 7 హాయ్ నాన్న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కూతురు సెంటిమెంట్ తో రూపొందిన ఈ ఎమోషనల్ మూవీ మీద ఫ్యామిలీ ఆడియన్స్ కి భారీ అంచనాలున్నాయి. ఇది పూర్తి కావడం ఆలస్యం వివేక్ ఆత్రేయతో సరిపోలేదా శనివారం మొదలైంది. చిన్న బ్రేక్ ఇచ్చారు కానీ డిసెంబర్ రెండో వారం తర్వాత ఏకధాటిగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
దీని తర్వాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చ్ లో మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి సైంధవ్ రిలీజయ్యాక హిట్ 3 ది థర్డ్ కేస్ పనిలో ఉంటాడు దర్శకుడు శైలేష్ కొలను. లైన్ ఆల్రెడీ లాక్ అయ్యిందని, ఫైనల్ వెర్షన్ రెడీ చేయాల్సి ఉందని ఇన్ సైడ్ టాక్. క్యారెక్టర్ తాలూకు హింట్ ని అడవి శేష్ హిట్ 2 క్లైమాక్స్ లో ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈ కథ ఉంటుంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ జనవరి లేదా ఫిబ్రవరిలో రావొచ్చు.
వీటి తర్వాత దసరాతో మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలకు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడు నాని. ఇది యాక్షన్ ఎంటర్ టైనరే. తిరుమల సందర్శనకు వచ్చిన దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో ఇది కూడా సెట్ అయిపోయినట్టే. మరో రెండు చర్చల దశలో ఉన్నాయి వాటి పేర్లు బయటికి రాకుండా నాని టీమ్ జాగ్రత్త పడుతోంది. హాయ్ నాన్న ఫలితాన్ని బట్టి హెవీ ఎమోషన్ ఉన్న కథలను ఎంచుకోవడం మీద నాని ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది. ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఈ రెండు ప్రాధాన్యంగా పెట్టుకుని కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రిప్టుతో ఎవరు వచ్చినా నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
This post was last modified on November 27, 2023 11:03 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…