ఈ రోజుల్లో 3 గంటల సినిమాలే అరుదు. అలాంటిది వచ్చే శుక్రవారం ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఓ సినిమా రాబోతోంది. అదేమీ ఆషామాషీ సినిమా కాదు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన యానిమల్.
ఈ సినిమాపై ఉన్న అంచనాల సంగతి తెలిసిందే. యానిమల్ రన్ టైం గురించి జరుగుతున్న ప్రచారమే నిజమై భారీ నిడివితో సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు-రెండున్నర గంటల సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యాలు యానిమల్ కోసం సర్దుబాట్లు చేసుకోక తప్పని పరిస్థితి. ఓ లెంగ్తీ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ప్రిపేరై రావాలి. ఇక థియేటర్లు కూడా షోల షెడ్యూలింగ్ పరంగా సర్దుబాట్లు చేసుకోక తప్పట్లేదు.
రెగ్యులర్ షోల టైం ప్రకారమే యానిమల్ షోలు వేయడానికి అవకాశం లేదు. అలా చేస్తే నాలుగు షోలు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 2 దాటుతుంది. అందుకే మామూలుగా 11 తర్వాత మొదలయ్యే మార్నింగ్ షోలను ఉదయం 10-10.30 మధ్య మొదలుపెడుతున్నాయి థియేటర్లు. అందుకు అనుగుణంగానే తర్వాతి షోలు కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల అర్లీ మార్నింగ్ షోలు పడబోతున్నాయి.
ఐదు షోలు వేయాలనుకుంటే ఉదయం 7 గంటలకు అటు ఇటుగా షోలు మొదలు పెట్టేయాల్సిందే. లెంగ్తీ రన్ టైం వల్ల థియేటర్లకు భారం తప్పదు. కరెంట్ సహా అన్ని రకాల ఖర్చులూ పెరగనున్నాయి. ఐతే సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో ఇక్కడ కొంచెం లాస్ ఉన్నప్పటికీ.. వసూళ్ల రూపంలో అదంతా కవర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. డిసెంబరు 1న యానిమల్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2023 7:28 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…