ఈ రోజుల్లో 3 గంటల సినిమాలే అరుదు. అలాంటిది వచ్చే శుక్రవారం ఏకంగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఓ సినిమా రాబోతోంది. అదేమీ ఆషామాషీ సినిమా కాదు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన యానిమల్.
ఈ సినిమాపై ఉన్న అంచనాల సంగతి తెలిసిందే. యానిమల్ రన్ టైం గురించి జరుగుతున్న ప్రచారమే నిజమై భారీ నిడివితో సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు-రెండున్నర గంటల సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యాలు యానిమల్ కోసం సర్దుబాట్లు చేసుకోక తప్పని పరిస్థితి. ఓ లెంగ్తీ సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ప్రిపేరై రావాలి. ఇక థియేటర్లు కూడా షోల షెడ్యూలింగ్ పరంగా సర్దుబాట్లు చేసుకోక తప్పట్లేదు.
రెగ్యులర్ షోల టైం ప్రకారమే యానిమల్ షోలు వేయడానికి అవకాశం లేదు. అలా చేస్తే నాలుగు షోలు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 2 దాటుతుంది. అందుకే మామూలుగా 11 తర్వాత మొదలయ్యే మార్నింగ్ షోలను ఉదయం 10-10.30 మధ్య మొదలుపెడుతున్నాయి థియేటర్లు. అందుకు అనుగుణంగానే తర్వాతి షోలు కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల అర్లీ మార్నింగ్ షోలు పడబోతున్నాయి.
ఐదు షోలు వేయాలనుకుంటే ఉదయం 7 గంటలకు అటు ఇటుగా షోలు మొదలు పెట్టేయాల్సిందే. లెంగ్తీ రన్ టైం వల్ల థియేటర్లకు భారం తప్పదు. కరెంట్ సహా అన్ని రకాల ఖర్చులూ పెరగనున్నాయి. ఐతే సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో ఇక్కడ కొంచెం లాస్ ఉన్నప్పటికీ.. వసూళ్ల రూపంలో అదంతా కవర్ అయిపోతుందనడంలో సందేహం లేదు. డిసెంబరు 1న యానిమల్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2023 7:28 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…