మలయాళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ నటుడంటే జోజు జార్జ్యే. భారీ అవతారంలో కనిపించే ఆయన్ని మామూలుగా చూస్తే ఏముంది ప్రత్యేకత అనిపిస్తుంది. కానీ జార్జ్ నటించిన సినిమాలు కొన్ని చూస్తే ఆయనకు ఫ్యాన్ అయిపోతాం. రాజశేఖర్ ‘శేఖర్’గా రీమేక్ చేసిన ‘జోసెఫ్’ కావచ్చు.. ‘కోటబొమ్మాళి పీఎస్’గా రీమేక్ అయిన ‘నాయట్టు’ కావచ్చు.. ‘ఇరట్టు’ అనే ఇంకో సెన్సేషనల్ థ్రిల్లర్ కావచ్చు.. ఆయా చిత్రాల్లో జార్జ్ పోషించిన పాత్రలు.. ఆయన నటన చూసి వావ్ అనకుండా ఉండలేం.
తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘జగమేతంత్రం’ ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. అందులో కూడా జార్జ్ పాత్ర, తన నటన స్పెషల్గా అనిపిస్తాయి. అలాంటి నటుడు తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడంటే తన గురించి తెలిసిన వాళ్లందరూ ఎగ్జైట్ అయ్యారు.
ఐతే శుక్రవారం రిలీజైన జార్జ్ తెలుగు డెబ్యూ మూవీ ‘ఆదికేశవ’ చూశాక అందరి ఆశలు నీరుగారిపోయాయి. జార్జ్ స్థాయికి ఏమాత్రం తగని పాత్ర ఇచ్చాడు కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి. ఇలాంటి ఫ్యాక్షనిస్టు పాత్రలు లెక్కలేనన్ని వచ్చాయి తెలుగులో. సినిమా మొత్తంలో జార్జ్ నట కౌశలాన్ని చూపించే ఒక్క సీన్ లేదు. ఆ పాత్రలో ఏ అనామక నటుడు ఉన్నా కూడా ఓకే అన్నట్లుగా సాగింది.
జార్జ్ కూడా ఈ క్యారెక్టర్ను చాలా మొక్కుబడిగా చేసుకుపోయినట్లు అనిపించింది. సినిమా మొత్తంలో మినిమం ఇంపాక్ట్ లేకుండా జార్జ్ చేసిన పాత్ర తన కెరీర్లో ఇదే కావచ్చు. ఈ మాత్రం దానికి జార్జ్ను ఏరికోరి ఎందుకు ఎంచుకున్నారన్నది అర్థం కాని విషయం. ఈ సినిమా కథ.. కథనం అన్నీ కూడా పరమ రొటీన్గా సాగిపోవడంతో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు తప్పట్లేదు. వైష్ణవ్ తేజ్ కెరీర్కు పెద్ద బ్రేక్ వేసేలా కనిపిస్తోంది ‘ఆదికేశవ’.
This post was last modified on November 25, 2023 4:28 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…