Movie News

అందరి లైనప్ బాగుంది.. చిరుదే

టాలీవుడ్ టాప్ స్టార్లు చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు. తమ ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను పెంచేలా, మార్కెట్‌ను విస్తరించేలా కాంబినేషన్లు ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో లాక్ డౌన్ వాళ్లకు బాగా ఉపయోగపడింది. బోలెడన్ని కథలు విని.. అందులోంచి బెస్ట్ అనుకున్నవే ఓకే చేశారు.

‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్.. దాని తర్వాత ‘సాహో’తో ఎదురు దెబ్బ తిన్నాడు. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అభిమానులు సంతృప్తిగా అయితే లేరు. కానీ దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక సినిమా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ లాంటి చారిత్రక సినిమా ప్రకటించడంతో ఇవి రెండూ అభిమానుల్నే కాక అందరినీ ఎగ్జైట్ చేశాయి. ఈ ప్రాజెక్టులు ప్రకటించాక ప్రభాస్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరనిపించింది.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. పరశురామ్‌ను నమ్మి ‘సర్కారు వారి పాట’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని టైటిల్ దగ్గర్నుంచి అన్నీ పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. దాని తర్వాత రాజమౌళి సినిమా లైన్లో ఉంది మహేష్ కోసం. మధ్యలో ఇంకేదైనా సినిమా చేస్తాడేమో తెలియదు.

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘పింక్’ రీమేక్‌తో ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు కొంత రుచించలేదు కానీ.. క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు ఓకే కావడంతో అభిమానులు సంతోషంగానే ఉన్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే సుకుమార్‌తో ‘పుష్ప’ లాంటి ఎగ్జైటింగ్ మూవీ చేస్తున్నాడు.

ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండూ చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులే. ఇక ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి టాప్ డైరెక్టర్లతో సినిమాలు ఓకే చేసుకుని మంచి లైనప్ సెట్ చేసుకున్నాడు. రామ్ చరణ్ సంగతే తేలాల్సి ఉంది.

ఐతే పై హీరోలందరితో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి లైనప్పే అభిమానులకు రుచించట్లేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ మీద మంచి అంచనాలున్నాయి కానీ.. దాని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్నాడు. ఆపై మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ డైరెక్టర్‌తో ‘వేదాళం’ రీమేక్ అంటున్నారు.

ఇంకో వైపు రొటీన్ సినిమాలు తీస్తాడని పేరున్న బాబీతో ఓ సినిమా ఓకే చేశాడంటున్నారు. ఈ లైనప్ ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించడం లేదు. లాక్ డౌన్ టైంను మిగతా హీరోలందరూ చక్కగా ఉపయోగించుకుని టాప్ డైరెక్టర్లతో ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు లైన్లో పెడితే చిరు మాత్రం ఇలా సాదాసీదా సినిమాలను ఓకే చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

This post was last modified on August 30, 2020 4:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago