బాలీవుడ్లో డేటింగ్లు, ఎఫైర్లు, బ్రేకప్లు సర్వ సాధారణమైన విషయాలు. ఇలాంటి వాటిలో భాగస్వామ్యం కాని హీరో హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అక్కడ మరీ దాపరికాలు కూడా ఏమీ ఉండవు. చాలా వరకు ఓపెన్గానే ఉంటారు. టాక్ షోల్లో ఎఫైర్లు, బ్రేకప్ల గురించి చాలా క్యాజువల్గా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోలో చర్చలన్నీ వీటి గురించే ఉంటాయి. ఈ షో పాపులారిటీ కూడా ఇలాంటి టాపిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది.
ఇటీవల ఇదే షోలో తన భర్త రణ్వీర్ సింగ్ పక్కనుండగా దీపికా పదుకొనే తన పాత రిలేషన్షిప్స్ గురించి చెప్పిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. తాజాగా సారా అలీ ఖాన్, అనన్య పాండే కలిసి పాల్గొన్న ఎపిసోడ్లోనూ రిలేషన్షిప్స్ మీద చర్చ జరిగింది. తమ ఇద్దరికీ కామన్ ‘ఎక్స్’ ఉన్నాడంటూ వీళ్లిద్దరూ ఈ షోలో ఒప్పుకోవడం చర్చనీయాంశం అయింది.
ఐతే ఒక వ్యక్తితో వేర్వేరు సమయాల్లో తాము డేటింగ్లో ఉన్నట్లు సారా, అనన్య చెప్పారు. ఆ వ్యక్తి పేరు చెప్పకపోయినా.. అది కార్తీక్ ఆర్యన్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. కాగా మాజీ బాయ్ఫ్రెండ్తో ఫ్రెండ్గా ఉండటం సాధ్యమా అని కరణ్ జోహార్ అడగ్గా.. దానికి బదులిస్తూ అదంత సులువు కాదని సారా చెప్పింది. ఒక రిలేషన్షిప్ కచ్చితంగా మనుషుల మీద ప్రభావం చూపుతుందని.. దాని తర్వాత మళ్లీ క్యాజువల్గా, ఫ్రెండ్గా ఉండటం చాలా కష్టమని ఆమె అంది. ప్రతి రిలేషన్షిప్ మనకు కొన్ని పాఠాలు నేర్పుతుందని ఆమె వ్యాఖ్యానించింది.
ఐతే సారా మరీ అభ్యంతరకరంగా ఏమీ మాట్లాడకపోయినా.. కార్తీక్కు ఇది నచ్చలేదు. తాను ఎప్పడూ ముగిసిన రిలేషన్షిప్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదని.. వ్యక్తిగత విషయాల గురించి పబ్లిక్ ఫ్లాట్ఫామ్స్ మీద మాట్లాడటం తనకు నచ్చదని అతనన్నాడు. సారా ఇలా ఓపెన్గా తమ రిలేషన్షిప్ గురించి మాట్లాడటం తనకు నచ్చలేదని అతను కుండబద్దలు కొట్టేశాడు.
This post was last modified on November 22, 2023 7:41 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…