క్రిస్మస్కు ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయం. ఆల్రెడీ ‘డంకీ’ లాంటి పెద్ద సినిమా ఆ పండక్కి రాబోతుండగా.. ‘సలార్’ సైతం అదే సీజన్ను ఎంచుకుంది. ఈ రెంటిలో ఏదో ఒకటి వాయిదా పడుతుందని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ ఉండదని తేలిపోయింది. రెండు చిత్ర బృందాలూ క్రిస్మస్ రిలీజ్ దిశగా సన్నాహాలను వేగవంతం చేశాయి. బిజినెస్ పూర్తి చేసి.. స్క్రీన్ల బుకింగ్ మీద దృష్టిపెట్టాయి. విడుదలకు ఇంకో నెల రోజులే ఉండడంతో యుఎస్ సహా కొన్ని దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి.
ఇండియా వరకు ‘డంకీ’ మీద ‘సలార్’ ఆధిపత్యం ఉంటుందన్నది ముందు నుంచి ఉన్న అంచనానే. ఐతే ఓవర్సీస్లో ‘సలార్’కు ‘డంకీ’ దీటుగా నిలుస్తుందని.. డామినేట్ చేసినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఇంతకుముందు. కానీ వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు.
యుఎస్లో ఇప్పటిదాకా జరిగిన ప్రి సేల్స్లో అయితే ‘సలార్’ పూర్తిగా డామినేట్ చేస్తోంది. ఇప్పటికే యుఎస్లో ‘సలార్’కు సంబంధించి 500కు పైగా షోలకు ప్రి సేల్స్ మొదలయ్యాయి. వాటి ద్వారా ఆల్రెడీ 1.30 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది ‘సలార్’. నెల రోజుల ముందే ఈ ఊపు చూసి షాకవుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఇప్పటికే 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ‘డంకీ’ ఊపేమీ కనిపించలేదు. వంద లోపే షోలకు ప్రి సేల్స్ మొదలు కాగా కలెక్షన్ వేల డాలర్లలోనే ఉంది. ఈ సినిమా టికెట్ల కోసం జనం ఏమీ ఎగబడట్లేదు. రిలీజ్ దగ్గర పడ్డాక ఏమైనా ఊపు పెరుగుతుందేమో చూడాలి.
కాగా డిసెంబరు 1న రిలీజయ్యే ‘యానిమల్’కు మాత్రం మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఆ సినిమా ఇప్పటికే 55 వేల డాలర్లు కలెక్ట్ చేసింది. కానీ ఇంకో మూడు వారాలు లేటుగా రిలీజయ్యే ‘సలార్’కే దాని కంటే ఎక్కువ ఊపు కనిపిస్తోంది. దీన్ని బట్టే ప్రభాస్ సినిమాకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on November 22, 2023 7:22 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…