ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంగళవారం’ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. దానికి ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం కూడా వసూళ్లు బాగున్నాయి. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ వల్ల వసూళ్లపై ప్రభావం ఉండొచ్చు. సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి వీక్ డేస్లో కూడా సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ మార్కులు హీరోయిన్ పాయల్ రాజ్పుత్కే పడతాయి. వేరే హీరోయిన్లెవ్వరూ అంత సులువుగా ఒప్పుకోని పాత్రలో ఆమె కన్విన్సింగ్ పెర్ఫామెన్స్తో ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలో మరికొందరు నటులు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఐతే సినిమా చివర్లో హైలైట్ అయింది మాత్రం జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయే.
చూడ్డానికి చాలా అందంగా, ముచ్చటగా కనిపిస్తూ.. చివర్లో షాకింగ్ ట్విస్టు ఇచ్చే ఈ పాత్రలో నటించిన అమ్మాయి ఎవరనే చర్చ నడుస్తోంది. తన పేరు.. దివ్యా పిళ్లై. ఆమె మలయాళ నటి. మలయాళంలో చాలా సినిమాలే చేసింది. ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్ర పోషించింది.
మలయాళంలో మరికొన్ని మంచి సినిమాలు చేసింది. తమిళంలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటించింది. తెలుగులో దివ్యకు ఇదే తొలి చిత్రం కాదు. ఇప్పటికే నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. ఆమె టాలెంట్ గుర్తించి అజయ్ భూపతి ‘మంగళవారం’లో ఛాన్సిచ్చాడు. ముందు మామూలుగా అనిపించే పాత్ర చివర్లో బాగా హైలైట్ అయింది. ఈ పాత్రలో దివ్య మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిలో పడింది.
This post was last modified on November 19, 2023 3:53 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…