ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంగళవారం’ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. దానికి ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం కూడా వసూళ్లు బాగున్నాయి. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ వల్ల వసూళ్లపై ప్రభావం ఉండొచ్చు. సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి వీక్ డేస్లో కూడా సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ మార్కులు హీరోయిన్ పాయల్ రాజ్పుత్కే పడతాయి. వేరే హీరోయిన్లెవ్వరూ అంత సులువుగా ఒప్పుకోని పాత్రలో ఆమె కన్విన్సింగ్ పెర్ఫామెన్స్తో ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలో మరికొందరు నటులు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఐతే సినిమా చివర్లో హైలైట్ అయింది మాత్రం జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయే.
చూడ్డానికి చాలా అందంగా, ముచ్చటగా కనిపిస్తూ.. చివర్లో షాకింగ్ ట్విస్టు ఇచ్చే ఈ పాత్రలో నటించిన అమ్మాయి ఎవరనే చర్చ నడుస్తోంది. తన పేరు.. దివ్యా పిళ్లై. ఆమె మలయాళ నటి. మలయాళంలో చాలా సినిమాలే చేసింది. ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్ర పోషించింది.
మలయాళంలో మరికొన్ని మంచి సినిమాలు చేసింది. తమిళంలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటించింది. తెలుగులో దివ్యకు ఇదే తొలి చిత్రం కాదు. ఇప్పటికే నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. ఆమె టాలెంట్ గుర్తించి అజయ్ భూపతి ‘మంగళవారం’లో ఛాన్సిచ్చాడు. ముందు మామూలుగా అనిపించే పాత్ర చివర్లో బాగా హైలైట్ అయింది. ఈ పాత్రలో దివ్య మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిలో పడింది.
This post was last modified on November 19, 2023 3:53 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…