ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంగళవారం’ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. దానికి ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం కూడా వసూళ్లు బాగున్నాయి. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ వల్ల వసూళ్లపై ప్రభావం ఉండొచ్చు. సినిమాకు మంచి టాక్ ఉంది కాబట్టి వీక్ డేస్లో కూడా సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ మార్కులు హీరోయిన్ పాయల్ రాజ్పుత్కే పడతాయి. వేరే హీరోయిన్లెవ్వరూ అంత సులువుగా ఒప్పుకోని పాత్రలో ఆమె కన్విన్సింగ్ పెర్ఫామెన్స్తో ప్రశంసలు అందుకుంటోంది. సినిమాలో మరికొందరు నటులు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఐతే సినిమా చివర్లో హైలైట్ అయింది మాత్రం జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయే.
చూడ్డానికి చాలా అందంగా, ముచ్చటగా కనిపిస్తూ.. చివర్లో షాకింగ్ ట్విస్టు ఇచ్చే ఈ పాత్రలో నటించిన అమ్మాయి ఎవరనే చర్చ నడుస్తోంది. తన పేరు.. దివ్యా పిళ్లై. ఆమె మలయాళ నటి. మలయాళంలో చాలా సినిమాలే చేసింది. ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్ర పోషించింది.
మలయాళంలో మరికొన్ని మంచి సినిమాలు చేసింది. తమిళంలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటించింది. తెలుగులో దివ్యకు ఇదే తొలి చిత్రం కాదు. ఇప్పటికే నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’లో హీరోయిన్ పాత్ర చేసింది. ఆ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడలేదు. ఆమె టాలెంట్ గుర్తించి అజయ్ భూపతి ‘మంగళవారం’లో ఛాన్సిచ్చాడు. ముందు మామూలుగా అనిపించే పాత్ర చివర్లో బాగా హైలైట్ అయింది. ఈ పాత్రలో దివ్య మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిలో పడింది.
This post was last modified on November 19, 2023 3:53 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…