గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడం.. అది అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం.. ఇక అప్పట్నుంచి టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకోవడం తెలిసిందే. ఈ 15 నెలల కాలంలో ఈ కోవలో చాలా సినిమాలే రిలీజయ్యాయి. మహేష్ బాబు మరో హిట్ మూవీ ‘బిజినెస్మ్యాన్’ సైతం మంచి స్పందన తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ చిత్రాలు ‘జల్సా’, ‘ఖుషి’లకు అయితే వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’, ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సైతం పర్వాలేదనిపించాయి. ఇంకా కొన్ని సినిమాలేవో బాగా ఆడాయి. ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఈ రీ రిలీజ్ల వరద మరీ ఎక్కువ అయిపోవడంతో నెమ్మదిగా అభిమానులు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రభావం ‘యోగి’ లాంటి సినిమాల విషయంలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ‘అదుర్స్’ సినిమా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
విశ్వక్సేన్ సైతం ప్రమోట్ చేసిన ‘అదుర్స్ 4కే’ షోలకు రెస్పాన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఎన్టీఆర్ అభిమానులే ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. ఎక్కడా షోలు ఫుల్ అయిన సంకేతాలు కనిపించట్లేదు. ఈ రోజు సినిమా రీ రిలీజ్ అవుతుంటే సోషల్ మీడియాలో కూడా సౌండ్ లేదు. తారక్ ఫ్యాన్స్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
మామూలుగా రీ రిలీజ్ డేట్కు కొన్ని రోజుల ముందు రెస్పాన్స్ సరిగా లేదంటే ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బుకింగ్స్, కలెక్షన్స్ పెంచడానికి ట్రై చేస్తారు. ‘సింహాద్రి’ విషయంలో అలా జరిగింది కూడా. కానీ ‘అదుర్స్’కు వచ్చేసరికి అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. చాలా షోలు జనం లేక వెలవెలబోయే పరిస్థితి ఉన్నా పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాలో సైతం ‘అదుర్స్’ ప్రస్తావనే తేకుండా సైలెంట్గా ఉన్నారు అభిమానులు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…