గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడం.. అది అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం.. ఇక అప్పట్నుంచి టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకోవడం తెలిసిందే. ఈ 15 నెలల కాలంలో ఈ కోవలో చాలా సినిమాలే రిలీజయ్యాయి. మహేష్ బాబు మరో హిట్ మూవీ ‘బిజినెస్మ్యాన్’ సైతం మంచి స్పందన తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ చిత్రాలు ‘జల్సా’, ‘ఖుషి’లకు అయితే వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’, ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సైతం పర్వాలేదనిపించాయి. ఇంకా కొన్ని సినిమాలేవో బాగా ఆడాయి. ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఈ రీ రిలీజ్ల వరద మరీ ఎక్కువ అయిపోవడంతో నెమ్మదిగా అభిమానులు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రభావం ‘యోగి’ లాంటి సినిమాల విషయంలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ‘అదుర్స్’ సినిమా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
విశ్వక్సేన్ సైతం ప్రమోట్ చేసిన ‘అదుర్స్ 4కే’ షోలకు రెస్పాన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఎన్టీఆర్ అభిమానులే ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. ఎక్కడా షోలు ఫుల్ అయిన సంకేతాలు కనిపించట్లేదు. ఈ రోజు సినిమా రీ రిలీజ్ అవుతుంటే సోషల్ మీడియాలో కూడా సౌండ్ లేదు. తారక్ ఫ్యాన్స్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
మామూలుగా రీ రిలీజ్ డేట్కు కొన్ని రోజుల ముందు రెస్పాన్స్ సరిగా లేదంటే ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బుకింగ్స్, కలెక్షన్స్ పెంచడానికి ట్రై చేస్తారు. ‘సింహాద్రి’ విషయంలో అలా జరిగింది కూడా. కానీ ‘అదుర్స్’కు వచ్చేసరికి అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. చాలా షోలు జనం లేక వెలవెలబోయే పరిస్థితి ఉన్నా పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాలో సైతం ‘అదుర్స్’ ప్రస్తావనే తేకుండా సైలెంట్గా ఉన్నారు అభిమానులు.
This post was last modified on November 18, 2023 4:33 pm
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…