నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అందరి దృష్టిలో పడ్డది, చెప్పుకోదగ్గ టాక్ తో దూసుకుపోతున్నది మంగళవారం ఒక్కటే. అయితే స్పార్క్ లైఫ్ ని కూడా టీమ్ గట్టిగానే ప్రమోట్ చేసుకుంది. కొత్త హీరో విక్రాంత్ రెడ్డితో పాటు హీరోయిన్లు మెహ్రీన్, రుక్సర్ ధిల్లాన్ లు కలిసి థియేటర్లకు వెళ్లి మరీ టికెట్లు అమ్మారు. నిన్న మార్నింగ్ షోలు జనంతో కలిసి చూశారు. పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన వైనం సోషల్ మీడియాలో కనిపించింది. విచిత్రంగా టైటిల్ కార్డులో దర్శకుడి పేరు తీసేసి ఏ ఫిలిం బై అంటూ బ్యానర్ పేరు వేసుకున్న స్పార్క్ లైఫ్ ఓపెనింగ్స్ సంగతి పక్కనపెడితే మ్యాటర్ ఉందో లేదో చూద్దాం.
ఆర్య(విక్రాంత్)ని తన కలల రాకుమారుడిగా భావించిన లేఖ(మెహ్రీన్)అతని వెంటపడి పిచ్చిగా ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే ఇతనికి మరో కోణం ఉందని జైదీప్(విక్రాంత్)పేరుతో కో మెడికల్ స్టూడెంట్ అనన్య(రుక్సర్)తో పాటు మరో కొంత మంది అమ్మాయిల హత్య కేసులో ఇతనే నిందితుడని పోలీసులు అరెస్ట్ చేశాక బయట పడుతుంది. స్పార్క్ లైఫ్ అనే మెదడుకు సంబంధించిన సైంటిఫిక్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ వ్యవహారం ముడిపడి ఉంటుంది. ఇంతకీ ఆర్య, జైదీప్ ఇద్దరూ ఒక్కరేనా, ఇంత పెద్ద కుంభకోణంలో అసలు నేరస్థులు ఎవరు అనేది తెరమీదే చూడాలి.
నటనపరంగా విక్రాంత్ ఇంకా మెరుగుపడకుండా పెద్ద కాన్వాస్ తో ఎంట్రీ ఇవ్వడంతో ఖరీదైన పొరపాటే. ఎక్స్ ప్రెషన్లతో పాటు హీరో మెటీరియల్ కావడానికి తగినంత శిక్షణ బోలెడు తీసుకోవాలి. విలన్ గా గురు సోమసుందరం ఆకట్టుకుంటాడు. స్టోరీ లైన్ సంగతి పక్కనపెడితే కథా కథనాలు ఈ బడ్జెట్ కు తగ్గ స్థాయిలో లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోయాయి. ఒక స్కామ్ చుట్టూ శాస్త్రీయ ప్రయోగాన్ని ముడిపెట్టి సూపర్ హీరో తరహాలో ఏదో చెప్పాలనుకున్న స్పార్క్ లైఫ్ టీమ్ ఇంకేదో చెప్పి ఫైనల్ గా నిరాశపరిచింది. ఓపిక తీరిక ఎంత ఉన్నా సరే స్పార్క్ లైఫ్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే.
This post was last modified on November 18, 2023 2:46 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…