ఆహాకు గొప్ప మైలేజ్ ఇచ్చిన బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయట పడబోతున్నాయి. అందులో ప్రధానమైంది రష్మిక మందన్న ప్రేమకథ. ఇవాళ వదిలిన ప్రోమోలో దానికి సంబంధించిన కీలక క్లూస్ ఇవ్వడంతో స్ట్రీమింగ్ కాబోయే నవంబర్ 24 డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అనిమల్ ప్రమోషన్ లో భాగంగా హీరో రన్బీర్ కపూర్, దర్శకుడు సందీప్ వంగాతో పాటు హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యింది. తనదైన శైలిలో బాలయ్య హుషారుగా ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ స్టేజి మీద స్టెప్పులు కూడా వేయించారు.
గేమ్ లో భాగంగా అర్జున్ రెడ్డి, అనిమల్ హీరోల్లో ఎవరు అందంగా ఉన్నారని రష్మికను అడగటం దగ్గర పజిల్ మొదలైంది. సమాధానం ట్రైలర్ లో రివీల్ చేయకపోయినా వచ్చే వారం తెలిసిపోతుంది. లైవ్ లో విజయ్ దేవరకొండకు రష్మికతో కాల్ చేయించడం మరో హైలైట్. ఫోన్ లిఫ్ట్ చేయగానే రౌడీ హీరో సంబోధించిన విధానం, రష్మిక ముసిముసినవ్వులు ఏదో గుట్టుని విప్పినట్టే అనిపిస్తోంది. గత కొంత కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉందని పలు కథనాలు సాక్ష్యాలతో సహా వస్తున్నా ఇద్దరు స్పందించలేదు. మొన్న దీపావళి పండక్కు రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నట్టు సెలబ్రేషన్స్ ఫోటోలో కనిపించింది.
ఇవన్నీ ఎంతవరకు నిజాలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ జరిగే రోజు తెలుస్తుంది. అన్స్టాపబుల్ రెండు సీజన్లు దిగ్విజయంగా నడిపించిన బాలయ్య ఇప్పుడీ స్పెషల్ ఎడిషన్ ని త్వరగానే ముగించే అవకాశం ఉంది. బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తో పాటు ఏపీలో రాబోయే ఎన్నికల కోసం బాలయ్య డైరీ బిజీగా మారనుంది. అందుకే ఈ సిరీస్ ని జెట్ స్పీడ్ తో లాగిస్తున్నారు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రేంజ్ లో ఎవరైనా క్రేజీ సెలబ్రిటీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవితో ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువేనని మెగా వర్గాల సమాచారం.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…