ఆహాకు గొప్ప మైలేజ్ ఇచ్చిన బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయట పడబోతున్నాయి. అందులో ప్రధానమైంది రష్మిక మందన్న ప్రేమకథ. ఇవాళ వదిలిన ప్రోమోలో దానికి సంబంధించిన కీలక క్లూస్ ఇవ్వడంతో స్ట్రీమింగ్ కాబోయే నవంబర్ 24 డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అనిమల్ ప్రమోషన్ లో భాగంగా హీరో రన్బీర్ కపూర్, దర్శకుడు సందీప్ వంగాతో పాటు హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యింది. తనదైన శైలిలో బాలయ్య హుషారుగా ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ స్టేజి మీద స్టెప్పులు కూడా వేయించారు.
గేమ్ లో భాగంగా అర్జున్ రెడ్డి, అనిమల్ హీరోల్లో ఎవరు అందంగా ఉన్నారని రష్మికను అడగటం దగ్గర పజిల్ మొదలైంది. సమాధానం ట్రైలర్ లో రివీల్ చేయకపోయినా వచ్చే వారం తెలిసిపోతుంది. లైవ్ లో విజయ్ దేవరకొండకు రష్మికతో కాల్ చేయించడం మరో హైలైట్. ఫోన్ లిఫ్ట్ చేయగానే రౌడీ హీరో సంబోధించిన విధానం, రష్మిక ముసిముసినవ్వులు ఏదో గుట్టుని విప్పినట్టే అనిపిస్తోంది. గత కొంత కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉందని పలు కథనాలు సాక్ష్యాలతో సహా వస్తున్నా ఇద్దరు స్పందించలేదు. మొన్న దీపావళి పండక్కు రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నట్టు సెలబ్రేషన్స్ ఫోటోలో కనిపించింది.
ఇవన్నీ ఎంతవరకు నిజాలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ జరిగే రోజు తెలుస్తుంది. అన్స్టాపబుల్ రెండు సీజన్లు దిగ్విజయంగా నడిపించిన బాలయ్య ఇప్పుడీ స్పెషల్ ఎడిషన్ ని త్వరగానే ముగించే అవకాశం ఉంది. బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తో పాటు ఏపీలో రాబోయే ఎన్నికల కోసం బాలయ్య డైరీ బిజీగా మారనుంది. అందుకే ఈ సిరీస్ ని జెట్ స్పీడ్ తో లాగిస్తున్నారు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రేంజ్ లో ఎవరైనా క్రేజీ సెలబ్రిటీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవితో ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువేనని మెగా వర్గాల సమాచారం.
This post was last modified on November 18, 2023 2:46 pm
తెలంగాణలో ఎన్నికల బరిలో లేకున్నా తెలుగుదేశం పార్టీకి అక్కడ గిరాకీ తగ్గడం లేదు. గత శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతు…
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…
గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…