ఆహాకు గొప్ప మైలేజ్ ఇచ్చిన బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయట పడబోతున్నాయి. అందులో ప్రధానమైంది రష్మిక మందన్న ప్రేమకథ. ఇవాళ వదిలిన ప్రోమోలో దానికి సంబంధించిన కీలక క్లూస్ ఇవ్వడంతో స్ట్రీమింగ్ కాబోయే నవంబర్ 24 డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అనిమల్ ప్రమోషన్ లో భాగంగా హీరో రన్బీర్ కపూర్, దర్శకుడు సందీప్ వంగాతో పాటు హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యింది. తనదైన శైలిలో బాలయ్య హుషారుగా ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళ గురించి గొప్పగా చెబుతూ స్టేజి మీద స్టెప్పులు కూడా వేయించారు.
గేమ్ లో భాగంగా అర్జున్ రెడ్డి, అనిమల్ హీరోల్లో ఎవరు అందంగా ఉన్నారని రష్మికను అడగటం దగ్గర పజిల్ మొదలైంది. సమాధానం ట్రైలర్ లో రివీల్ చేయకపోయినా వచ్చే వారం తెలిసిపోతుంది. లైవ్ లో విజయ్ దేవరకొండకు రష్మికతో కాల్ చేయించడం మరో హైలైట్. ఫోన్ లిఫ్ట్ చేయగానే రౌడీ హీరో సంబోధించిన విధానం, రష్మిక ముసిముసినవ్వులు ఏదో గుట్టుని విప్పినట్టే అనిపిస్తోంది. గత కొంత కాలంగా ఈ జంట డేటింగ్ లో ఉందని పలు కథనాలు సాక్ష్యాలతో సహా వస్తున్నా ఇద్దరు స్పందించలేదు. మొన్న దీపావళి పండక్కు రష్మిక విజయ్ ఇంట్లోనే ఉన్నట్టు సెలబ్రేషన్స్ ఫోటోలో కనిపించింది.
ఇవన్నీ ఎంతవరకు నిజాలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ జరిగే రోజు తెలుస్తుంది. అన్స్టాపబుల్ రెండు సీజన్లు దిగ్విజయంగా నడిపించిన బాలయ్య ఇప్పుడీ స్పెషల్ ఎడిషన్ ని త్వరగానే ముగించే అవకాశం ఉంది. బాబీ దర్శకత్వంలో సినిమా షూటింగ్ తో పాటు ఏపీలో రాబోయే ఎన్నికల కోసం బాలయ్య డైరీ బిజీగా మారనుంది. అందుకే ఈ సిరీస్ ని జెట్ స్పీడ్ తో లాగిస్తున్నారు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రేంజ్ లో ఎవరైనా క్రేజీ సెలబ్రిటీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవితో ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువేనని మెగా వర్గాల సమాచారం.
This post was last modified on November 18, 2023 2:46 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…