ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మోస్ట్ యాంకర్ గా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సుమ కనకాల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతున్నారేమో కానీ సుమ మాత్రం ఎవర్ గ్రీన్ వ్యాఖ్యాతగా ప్రతి ప్రోగ్రాంకు ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. ఈవిడ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో తెలియని గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేనే యాంకరని చెప్పుకునేంత. నిజానికి అంత హుషారు చలాకీతనం ఇప్పటి వాళ్ళలో కొరవడిన మాట వాస్తవం. కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ సుమ దరిదాపుల్లో కూడా నిలవలేకపోతున్నారు.
ఇంత అనుభవమున్న సుమ యాంకరింగ్ తో పాటు కొత్త సినిమాల ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం హైదరాబాద్ వచ్చిన హీరో రక్షిత్ శెట్టితో ముఖాముఖీ నిర్వహించింది సుమ. సమయా భావం వల్ల ముందే ప్రిపేర్ కాకపోవడంతో కొన్ని ప్రశ్నలు మిస్ ఫైర్ కావడం వల్ల సోషల్ మీడియాకో టాపిక్ దొరికేసింది. స్టోరీ మీరు రాసుకున్నప్పుడే రెండు భాగాలు అనుకున్నారా అన్న క్వశ్చన్ వాటిలో ప్రధానమైంది. నిజానికి ఈ మూవీ కథ మాటలు స్క్రీన్ ప్లే అన్నీ హేమంత్ రావే తప్ప రైటింగ్ పరంగా రక్షిత్ ప్రమేయం లేదు.
టూ పార్ట్స్ అన్నప్పుడు ప్రొడ్యూసర్ ఎలా రియాక్ట్ అయ్యారనేది సుమ అడిగిన మరో ప్రశ్న. సప్త సాగరాలు రెండు భాగాలకు నిర్మాత కం హీరో రెండు ఒకరే. అతనే రక్షిత్ శెట్టి. ఇంకో ప్రశ్నలో కెరీర్ లో రైటర్, యాక్టర్, ప్రొడ్యూసర్, సింగర్ ఇలా ఇన్ని పాత్రలు ఎలా పోషించారని అడిగారు. నిజానికి రక్షిత్ గాయకుడు కాదు. ముందే టీమ్ నుంచి సరైన ఇన్ పుట్స్ తీసుకోకపోవడం వల్ల సుమకొచ్చిన తిప్పలివి. పోనీ స్క్రిప్ట్ వేరొకరు ప్రిపేర్ చేశారనుకుంటే వాళ్ళకైనా ఈ విషయాల పట్ల అవగాహన ఉండాల్సింది. ఏది ఏమైనా వీడియోల జమానాలో ఎవరైనా సరే జాగ్రత్తగా లేకపోతే ఇలాగే దొరికిపోతారు.
This post was last modified on November 17, 2023 11:40 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…