టాలీవుడ్లో పెద్ద సినిమాలకు కాపీ మరకలు అంటడం కొత్తేమీ కాదు. పేరున్న దర్శకులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఓ వైపు కొరటాల శివ, మరోవైపు సుకుమార్ ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐతే వీళ్లిద్దరి మీద ఆరోపణలు చేస్తున్న వారి వాదన అయితే అంత బలంగా లేదు. ఇంకా కనీసం టీజర్లు కూడా రాని సినిమాల కథలు తమవే అన్న వాదన గట్టిగా నిలబడట్లేదు.
అందులోనూ సుకుమార్ మీద కడప జిల్లా రచయిత వేంపల్లి గంగాధర్ చేసిన ఆరోపణలు మరీ తేలిపోతున్నాయి. ఐతే సోషల్ మీడియాలో మన స్టార్ డైరెక్టర్ల చౌర్యం గురించి ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరటాల శివ, సుకుమార్ల కంటే మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఎక్కువ తిడుతుండటం గమనార్హం.
ఇప్పుడే కాదు.. టాలీవుడ్లో ఏ స్టార్ దర్శకుడి మీద కాపీ ఆరోపణలు వచ్చినా.. టాపిక్ డైవర్ట్ అయ్యేది త్రివిక్రమ్ వైపే. అందరిలోకి అత్యంత తెలివైన వాడిగా, జ్ఞాన సంపద ఉన్న వాడిగా, సాహిత్యంపై అమితమైన అవగాహన ఉన్నవాడిగా కనిపించే త్రివిక్రమ్ పెద్ద కాపీ మాస్టర్ అనేది ఆయన సినిమాల్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది. త్రివిక్రమ్.. కాపీ.. అనే పదాలు యూట్యూబ్లో కొడితే చాలు. ‘అతడు’ దగ్గర్నుంచి ‘అజ్ఞాతవాసి’ వరకు ఆయన ఎక్కడెక్కడి నుంచే లేపుకొచ్చిన సన్నివేశాలు వచ్చి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. ఇక ‘అఆ’ సినిమాను యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ నవల ఆధారంగా తీసి.. కనీసం ఆమెకు క్రెడిట్ కూడా ఇవ్వకుండా
త్రివిక్రమ్ ఎలా విమర్శలెదుర్కొన్నాడో తెలిసిందే. అలాగే వేంపల్లి గంగాధర్ ‘మొండికత్తి’ కథ స్ఫూర్తి ‘అరవింద సమేత’లో కనిపిస్తుంది. ఆ కోపంతోనే గంగాధర్ ఇప్పుడు సుకుమార్ను కూడా అదే గాటన కట్టేసి తన కథను కాపీ కొట్టేస్తున్నాడని అంటున్నాడు. ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ను పట్టుకొచ్చి ‘అజ్ఞాతవాసి’ని తీసిన విషయమూ స్పష్టంగా తెలిసిందే.
ఇలా త్రివిక్రమ్ మీద కాపీ మరకలకు కొదవే లేదు. ప్రస్తుత చర్చలో మిగతా దర్శకుల్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ను తిట్టే వాళ్ల సంఖ్య భారీగానే ఉంటోంది. మిగతా వాళ్లతో పోలిస్తే మక్కీకి మక్కీ సీన్లు, స్టోరీలు దించేస్తాడన్నది త్రివిక్రమ్ మీద ఉన్న ఆరోపణ. అందుకే ఈ విమర్శలు. తన మీద జనాల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఉందని త్రివిక్రమ్కు అసలు తెలుసా మరి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…