టాలీవుడ్లో పెద్ద సినిమాలకు కాపీ మరకలు అంటడం కొత్తేమీ కాదు. పేరున్న దర్శకులు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఓ వైపు కొరటాల శివ, మరోవైపు సుకుమార్ ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐతే వీళ్లిద్దరి మీద ఆరోపణలు చేస్తున్న వారి వాదన అయితే అంత బలంగా లేదు. ఇంకా కనీసం టీజర్లు కూడా రాని సినిమాల కథలు తమవే అన్న వాదన గట్టిగా నిలబడట్లేదు.
అందులోనూ సుకుమార్ మీద కడప జిల్లా రచయిత వేంపల్లి గంగాధర్ చేసిన ఆరోపణలు మరీ తేలిపోతున్నాయి. ఐతే సోషల్ మీడియాలో మన స్టార్ డైరెక్టర్ల చౌర్యం గురించి ఇప్పుడు పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరటాల శివ, సుకుమార్ల కంటే మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఎక్కువ తిడుతుండటం గమనార్హం.
ఇప్పుడే కాదు.. టాలీవుడ్లో ఏ స్టార్ దర్శకుడి మీద కాపీ ఆరోపణలు వచ్చినా.. టాపిక్ డైవర్ట్ అయ్యేది త్రివిక్రమ్ వైపే. అందరిలోకి అత్యంత తెలివైన వాడిగా, జ్ఞాన సంపద ఉన్న వాడిగా, సాహిత్యంపై అమితమైన అవగాహన ఉన్నవాడిగా కనిపించే త్రివిక్రమ్ పెద్ద కాపీ మాస్టర్ అనేది ఆయన సినిమాల్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది. త్రివిక్రమ్.. కాపీ.. అనే పదాలు యూట్యూబ్లో కొడితే చాలు. ‘అతడు’ దగ్గర్నుంచి ‘అజ్ఞాతవాసి’ వరకు ఆయన ఎక్కడెక్కడి నుంచే లేపుకొచ్చిన సన్నివేశాలు వచ్చి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. ఇక ‘అఆ’ సినిమాను యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ నవల ఆధారంగా తీసి.. కనీసం ఆమెకు క్రెడిట్ కూడా ఇవ్వకుండా
త్రివిక్రమ్ ఎలా విమర్శలెదుర్కొన్నాడో తెలిసిందే. అలాగే వేంపల్లి గంగాధర్ ‘మొండికత్తి’ కథ స్ఫూర్తి ‘అరవింద సమేత’లో కనిపిస్తుంది. ఆ కోపంతోనే గంగాధర్ ఇప్పుడు సుకుమార్ను కూడా అదే గాటన కట్టేసి తన కథను కాపీ కొట్టేస్తున్నాడని అంటున్నాడు. ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ను పట్టుకొచ్చి ‘అజ్ఞాతవాసి’ని తీసిన విషయమూ స్పష్టంగా తెలిసిందే.
ఇలా త్రివిక్రమ్ మీద కాపీ మరకలకు కొదవే లేదు. ప్రస్తుత చర్చలో మిగతా దర్శకుల్ని పక్కన పెట్టి త్రివిక్రమ్ను తిట్టే వాళ్ల సంఖ్య భారీగానే ఉంటోంది. మిగతా వాళ్లతో పోలిస్తే మక్కీకి మక్కీ సీన్లు, స్టోరీలు దించేస్తాడన్నది త్రివిక్రమ్ మీద ఉన్న ఆరోపణ. అందుకే ఈ విమర్శలు. తన మీద జనాల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఉందని త్రివిక్రమ్కు అసలు తెలుసా మరి.
This post was last modified on August 30, 2020 9:44 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…