బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఒక టైంలో ఎంత బాగా ఆడాయో తెలిసిందే. ‘ఎం.ఎస్.ధోని: అన్టోల్డ్ స్టోరీ’ అయితే పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి కానీ.. అవేవీ సరైన ఫలితాలు అందుకోలేదు. సైనా, మిథాలీ రాజ్ల మీద తీసిన సినిమాలు వాషౌట్ అయ్యాక ఈ జానర్ జోరు తగ్గింది.
ఐతే సరైన స్పోర్ట్స్ బయోపిక్ తీస్తే ఇప్పటికీ మంచి రెస్పాన్సే వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఆ పొటెన్షియాలిటీ ఉన్న బయోపిక్.. విరాట్ కోహ్లిదే అవుతుందన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. ఐతే విరాట్ బయోపిక్ తీస్తే.. దానికి న్యాయం చేసే నటుడు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ మధ్య మీడియా వాళ్లు కూడా సెలబ్రెటీలను ఈ ప్రశ్న తరచుగా అడుగుతున్నారు.
తాజాగా రణబీర్ కపూర్ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. ‘యానిమల్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతుండగా.. విరాట్ కోహ్లి బయోపిక్ చేస్తారా? అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అని విలేకరులు అడగ్గా.. ‘‘కోహ్లి జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో అతడే నటించాలి. ఎందుకంటే చాలామంది నటుల కంటే అతనే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్గా కూడా ఉంటాడు.
అందుకే తన పాత్రను కోహ్లీనే పోషించాలి’’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు రణబీర్. తద్వారా తానైతే కోహ్లి బయోపిక్లో నటించనని రణబీర్ చెప్పకనే చెప్పేశాడు. బాలీవుడ్ హీరోల సంగతేమో కానీ.. మన టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైర రామ్ చరణ్.. మరో యంగ్ హీరో రామ్ల్లో విరాట్ కోహ్లి పోలికలు ఉన్నాయని.. వాళ్లిద్దరిలో ఒకరు విరాట్ బయోపిక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతుంటాయి.
This post was last modified on November 16, 2023 3:32 pm
హిందూపురం.. టీడీపీ కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇక్కడ టీడీపీకి ఎదురేలేదు. వరుసగా రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ఈ…
సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా…
నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్…
రాజకీయాల్లో అన్ని వేళలా పంతమే పనికిరాదు. ఒక్కొక్కసారి పట్టు విడుపులు కూడా ముఖ్యమే. ఈ విషయంలో నాయకులు, పార్టీలు కూడా..…
హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్…
ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు, పోలీసు ఆఫీసర్లకు రెడ్బుక్ భయం పట్టుకుందనే చర్చ హాట్టాపిక్గా మారింది. ఇన్ని రోజులు అధికార వైసీపీ…