బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఒక టైంలో ఎంత బాగా ఆడాయో తెలిసిందే. ‘ఎం.ఎస్.ధోని: అన్టోల్డ్ స్టోరీ’ అయితే పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి కానీ.. అవేవీ సరైన ఫలితాలు అందుకోలేదు. సైనా, మిథాలీ రాజ్ల మీద తీసిన సినిమాలు వాషౌట్ అయ్యాక ఈ జానర్ జోరు తగ్గింది.
ఐతే సరైన స్పోర్ట్స్ బయోపిక్ తీస్తే ఇప్పటికీ మంచి రెస్పాన్సే వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఆ పొటెన్షియాలిటీ ఉన్న బయోపిక్.. విరాట్ కోహ్లిదే అవుతుందన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. ఐతే విరాట్ బయోపిక్ తీస్తే.. దానికి న్యాయం చేసే నటుడు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ మధ్య మీడియా వాళ్లు కూడా సెలబ్రెటీలను ఈ ప్రశ్న తరచుగా అడుగుతున్నారు.
తాజాగా రణబీర్ కపూర్ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. ‘యానిమల్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతుండగా.. విరాట్ కోహ్లి బయోపిక్ చేస్తారా? అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అని విలేకరులు అడగ్గా.. ‘‘కోహ్లి జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో అతడే నటించాలి. ఎందుకంటే చాలామంది నటుల కంటే అతనే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్గా కూడా ఉంటాడు.
అందుకే తన పాత్రను కోహ్లీనే పోషించాలి’’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు రణబీర్. తద్వారా తానైతే కోహ్లి బయోపిక్లో నటించనని రణబీర్ చెప్పకనే చెప్పేశాడు. బాలీవుడ్ హీరోల సంగతేమో కానీ.. మన టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైర రామ్ చరణ్.. మరో యంగ్ హీరో రామ్ల్లో విరాట్ కోహ్లి పోలికలు ఉన్నాయని.. వాళ్లిద్దరిలో ఒకరు విరాట్ బయోపిక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతుంటాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…