బాలీవుడ్లో స్పోర్ట్స్ బయోపిక్స్ ఒక టైంలో ఎంత బాగా ఆడాయో తెలిసిందే. ‘ఎం.ఎస్.ధోని: అన్టోల్డ్ స్టోరీ’ అయితే పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్ లాంటి స్పోర్ట్స్ బయోపిక్స్ కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ వరుసలో తర్వాత చాలా స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి కానీ.. అవేవీ సరైన ఫలితాలు అందుకోలేదు. సైనా, మిథాలీ రాజ్ల మీద తీసిన సినిమాలు వాషౌట్ అయ్యాక ఈ జానర్ జోరు తగ్గింది.
ఐతే సరైన స్పోర్ట్స్ బయోపిక్ తీస్తే ఇప్పటికీ మంచి రెస్పాన్సే వస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఆ పొటెన్షియాలిటీ ఉన్న బయోపిక్.. విరాట్ కోహ్లిదే అవుతుందన్న చర్చ కొంత కాలంగా నడుస్తోంది. ఐతే విరాట్ బయోపిక్ తీస్తే.. దానికి న్యాయం చేసే నటుడు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ మధ్య మీడియా వాళ్లు కూడా సెలబ్రెటీలను ఈ ప్రశ్న తరచుగా అడుగుతున్నారు.
తాజాగా రణబీర్ కపూర్ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. ‘యానిమల్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతుండగా.. విరాట్ కోహ్లి బయోపిక్ చేస్తారా? అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అని విలేకరులు అడగ్గా.. ‘‘కోహ్లి జీవితాన్ని సినిమాగా తీస్తే అందులో అతడే నటించాలి. ఎందుకంటే చాలామంది నటుల కంటే అతనే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్గా కూడా ఉంటాడు.
అందుకే తన పాత్రను కోహ్లీనే పోషించాలి’’ అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు రణబీర్. తద్వారా తానైతే కోహ్లి బయోపిక్లో నటించనని రణబీర్ చెప్పకనే చెప్పేశాడు. బాలీవుడ్ హీరోల సంగతేమో కానీ.. మన టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైర రామ్ చరణ్.. మరో యంగ్ హీరో రామ్ల్లో విరాట్ కోహ్లి పోలికలు ఉన్నాయని.. వాళ్లిద్దరిలో ఒకరు విరాట్ బయోపిక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతుంటాయి.
This post was last modified on November 16, 2023 3:32 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…