ప్రతి ఫిలిం మేకర్ తమ సినిమా సూపర్ అనే అంటాడు. టీంలో పని చేసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి ఆహా ఓహో అనే అంటారు. కానీ ఆ సినిమా ప్రోమోలు చూస్తేనే నిజంగా అందులో కంటెంట్ ఉందా లేదా అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వారం రిలీజ్ కాబోతున్న ‘మంగళవారం’ సినిమాకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని తీసుకురాగలిగాయి. ‘కాంతార’, ‘విరూపాక్ష’ తరహా మిస్టిక్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోందీ సినిమా.
కథేంటన్నది ప్రోమోల్లో క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సినిమాలో ఏదో నిగూఢంగా ఉంటుందనే సంకేతాలు కనిపించాయి. ఈ సినిమా మీద టీం అంతా సూపర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. టాలీవుడ్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే చర్చ నడుస్తోంది. సినిమా చూసిన వాళ్లందరూ పాయల్ రాజ్పుత్ పాత్ర గురించి, సెకండాఫ్లో ట్విస్టుల గురించి గొప్పగా చెబుతున్నారు.
దర్శకుడు అజయ్ భూపతి అయితే ‘మంగళవారం’ మీద మామూలు కాన్ఫిడెన్స్లో లేడు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అవుతుందని ‘మంగళవారం’ గురించి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కథ మీద నమ్మకంతోనే నిర్మాతలు రూ.20 కోట్ల దాకా ఖర్చు పెట్టారని అతను చెప్పాడు. రిలీజ్కు ముందే సినిమాకు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని కూడా చెబుతున్నాడు. టెక్నికల్గా ఒక లెవెల్లో సినిమా ఉంటుందని.. మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని.. చివరి 45 నిమిషాల్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అయిపోతారని చెబుతున్నాడు.
తన రెండో సినిమా ‘మహాసముద్రం’లో ట్విస్టులేమీ లేకుండా ప్లెయిన్గా ఒక కథ చెప్పాలని చూశానని.. అది వర్కవుట్ కాలేదని.. దీంతో ఈసారి రూటు మార్చి కొత్త జానర్ ఎంచుకుని ప్రేక్షకులు ఊహించలేని ట్విస్టులతో ఈ సినిమా తీశానని.. సినిమా మామూలుగా ఉండదని.. పెద్ద హిట్టవుతుందని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి నిజంగా దర్శకుడు, టీం చెబుతున్నంత స్థాయిలో ‘మంగళవారం’ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on November 15, 2023 6:59 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…