ప్రతి ఫిలిం మేకర్ తమ సినిమా సూపర్ అనే అంటాడు. టీంలో పని చేసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి ఆహా ఓహో అనే అంటారు. కానీ ఆ సినిమా ప్రోమోలు చూస్తేనే నిజంగా అందులో కంటెంట్ ఉందా లేదా అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వారం రిలీజ్ కాబోతున్న ‘మంగళవారం’ సినిమాకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని తీసుకురాగలిగాయి. ‘కాంతార’, ‘విరూపాక్ష’ తరహా మిస్టిక్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోందీ సినిమా.
కథేంటన్నది ప్రోమోల్లో క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సినిమాలో ఏదో నిగూఢంగా ఉంటుందనే సంకేతాలు కనిపించాయి. ఈ సినిమా మీద టీం అంతా సూపర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. టాలీవుడ్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే చర్చ నడుస్తోంది. సినిమా చూసిన వాళ్లందరూ పాయల్ రాజ్పుత్ పాత్ర గురించి, సెకండాఫ్లో ట్విస్టుల గురించి గొప్పగా చెబుతున్నారు.
దర్శకుడు అజయ్ భూపతి అయితే ‘మంగళవారం’ మీద మామూలు కాన్ఫిడెన్స్లో లేడు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అవుతుందని ‘మంగళవారం’ గురించి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కథ మీద నమ్మకంతోనే నిర్మాతలు రూ.20 కోట్ల దాకా ఖర్చు పెట్టారని అతను చెప్పాడు. రిలీజ్కు ముందే సినిమాకు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని కూడా చెబుతున్నాడు. టెక్నికల్గా ఒక లెవెల్లో సినిమా ఉంటుందని.. మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని.. చివరి 45 నిమిషాల్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అయిపోతారని చెబుతున్నాడు.
తన రెండో సినిమా ‘మహాసముద్రం’లో ట్విస్టులేమీ లేకుండా ప్లెయిన్గా ఒక కథ చెప్పాలని చూశానని.. అది వర్కవుట్ కాలేదని.. దీంతో ఈసారి రూటు మార్చి కొత్త జానర్ ఎంచుకుని ప్రేక్షకులు ఊహించలేని ట్విస్టులతో ఈ సినిమా తీశానని.. సినిమా మామూలుగా ఉండదని.. పెద్ద హిట్టవుతుందని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి నిజంగా దర్శకుడు, టీం చెబుతున్నంత స్థాయిలో ‘మంగళవారం’ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on November 15, 2023 6:59 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…