Movie News

ఇండస్ట్రీకి జగన్ ఏం చేశారు?: నట్టి కుమార్

వైఎస్ కుటుంబంపై ప్రముఖ సినీ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ ప్రశంసలు కురిపించారు. వైఎస్ ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదని అలీ అన్నారు. వైఎస్సార్ నటుడిలో ఓ కళాకారుడ్ని మాత్రమే చూసి సాయం చేశారని, ఇప్పుడు తండ్రి బాటలోనే సీఎం జగన్ కూడా నడుస్తున్నారని అలీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళి, అలీలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ చేశారు. జగన్ ను వేనోళ్ల అలీ, పోసాని పొగుడుతున్నారని, చిత్ర పరిశ్రమకు జగన్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఏం చేశాడని జగన్ ను కీర్తిస్తున్నారని ప్రశ్నించారు.

ఏపీలో పుట్టిన బిడ్డగా గర్విస్తున్నానని అలీ అన్నారని, ఏపీలో పుట్టిన బిడ్డగా తాను కూడా గర్విస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులన్నీ గర్వించదగ్గవేననీ, కానీ, జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడని అలీ ఆయను పొగుడుతున్నాడో చెప్పాలని నిలదీశారు. తన ప్రశ్నలకు అలీ, పోసాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే… అవును, మాకు సమాధానం చెప్పడం చేతకాలేదని చెప్పాలని అన్నారు.

టికెట్ రేట్ల కోసం అలీ, పోసాని, చిరంజీవి గారు, ఆర్.నారాయణమూర్తి గారు, రాజమౌళి గారు జగన్ వద్దకు వెళ్లారని, జగన్ కు చిరంజీవి రెండు చేతులు జోడించి దండం పెడుతున్న దృశ్యాల వీడియోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఆ వీడియో విడుదల చేయడాన్ని అలీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ వీడియోతో ఇండస్ట్రీలో చిరంజీవి హుందాతనం ఎంతో పెరిగిపోయిందని, ఖండించకపోవడం వల్ల మీ విలువ తగ్గిపోయిందని అలీని దుయ్యబట్టారు.

మీరు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? జగన్ మోహన్ రెడ్డి నుంచి ఏం తాయిలాలు తీసుకువచ్చారు? అని ప్రశ్నించారు. “మీ వల్ల ఇండస్ట్రీకి ఏమైనా రాయితీలు వచ్చాయా? మనం విశాఖలో ఏమైనా స్టూడియో కట్టగలిగామా? ఏపీలో షూటింగులు జరుపుకోవడానికి, ఇక్కడ్నించి ఏపీకి తరలి వెళ్లడానికి ఏమైనా అనుకూల వాతావరణం కల్పించగలిగారా?” అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

This post was last modified on November 12, 2023 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

3 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

56 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago