వైఎస్ కుటుంబంపై ప్రముఖ సినీ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ ప్రశంసలు కురిపించారు. వైఎస్ ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదని అలీ అన్నారు. వైఎస్సార్ నటుడిలో ఓ కళాకారుడ్ని మాత్రమే చూసి సాయం చేశారని, ఇప్పుడు తండ్రి బాటలోనే సీఎం జగన్ కూడా నడుస్తున్నారని అలీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పోసాని కృష్ణమురళి, అలీలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ చేశారు. జగన్ ను వేనోళ్ల అలీ, పోసాని పొగుడుతున్నారని, చిత్ర పరిశ్రమకు జగన్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. ఏం చేశాడని జగన్ ను కీర్తిస్తున్నారని ప్రశ్నించారు.
ఏపీలో పుట్టిన బిడ్డగా గర్విస్తున్నానని అలీ అన్నారని, ఏపీలో పుట్టిన బిడ్డగా తాను కూడా గర్విస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులన్నీ గర్వించదగ్గవేననీ, కానీ, జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడని అలీ ఆయను పొగుడుతున్నాడో చెప్పాలని నిలదీశారు. తన ప్రశ్నలకు అలీ, పోసాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సమాధానం చెప్పలేకపోతే… అవును, మాకు సమాధానం చెప్పడం చేతకాలేదని చెప్పాలని అన్నారు.
టికెట్ రేట్ల కోసం అలీ, పోసాని, చిరంజీవి గారు, ఆర్.నారాయణమూర్తి గారు, రాజమౌళి గారు జగన్ వద్దకు వెళ్లారని, జగన్ కు చిరంజీవి రెండు చేతులు జోడించి దండం పెడుతున్న దృశ్యాల వీడియోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఆ వీడియో విడుదల చేయడాన్ని అలీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఆ వీడియోతో ఇండస్ట్రీలో చిరంజీవి హుందాతనం ఎంతో పెరిగిపోయిందని, ఖండించకపోవడం వల్ల మీ విలువ తగ్గిపోయిందని అలీని దుయ్యబట్టారు.
మీరు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారు? జగన్ మోహన్ రెడ్డి నుంచి ఏం తాయిలాలు తీసుకువచ్చారు? అని ప్రశ్నించారు. “మీ వల్ల ఇండస్ట్రీకి ఏమైనా రాయితీలు వచ్చాయా? మనం విశాఖలో ఏమైనా స్టూడియో కట్టగలిగామా? ఏపీలో షూటింగులు జరుపుకోవడానికి, ఇక్కడ్నించి ఏపీకి తరలి వెళ్లడానికి ఏమైనా అనుకూల వాతావరణం కల్పించగలిగారా?” అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
This post was last modified on November 12, 2023 10:04 am
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…