నిన్న విడుదలైన జిగర్ తండ డబుల్ ఎక్స్ కి తెలుగులో ఆశించిన స్పందన లేదని కలెక్షన్లు, రివ్యూలు రెండూ స్పష్టం చేశాయి. చాలా చోట్ల కనీస ఓపెనింగ్స్ రాలేదు. అర్బన్ లో ఓ మోస్తరుగా ఓకే అనుకుంటే బిసి సెంటర్స్ లో మాత్రం నామమాత్రపు వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ టాక్. తమిళంలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది మనకనవసరం. అభిరుచుల్లో తేడాలుంటాయి కాబట్టి ఇక్కడి ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి చరణ్ అభిమానులకు ఉన్న కనెక్షన్ ఏంటంటే విషయానికి వద్దాం. గేమ్ ఛేంజర్ కు కథను ఇచ్చింది జిగర్ తాండ డబుల్ ఎక్స్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజే.
ఇక్కడ ఎందుకు టెన్షనంటే గేమ్ చేంజర్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దశాబ్దాల క్రితం బ్యాక్ డ్రాప్ తో జరుగుతుంది. అప్పటి రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, నమ్మక ద్రోహాలు వీటి చుట్టూ అల్లుకున్నారు. అప్పన్నగా రామ్ చరణ్ సన్నని మీసం, పంచెకట్టుతో కనిపిస్తాడు. జిగర్ తండలోనూ పాలిటిక్స్ టచ్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ అందులో డ్రామాని మరీ ఓవర్ గా ప్రెజెంట్ చేశారు. అడవి గిరిజనులను మోసం చేసే క్రమాన్ని ముఖ్యమంత్రి రేంజ్ లో చూపించడం అతిశయోక్తిని దాటి పోయింది. క్లైమాక్స్ అయితే మనవాళ్ళు అంత సులభంగా జీర్ణించుకోలేని రీతిలో ఉంటుంది.
ఇలాంటివి గేమ్ చేంజర్ లోనూ ఉంటాయేమోననే అనుమానం రావడం సహజమే. కాకపోతే స్టోరీ ఇచ్చింది సుబ్బరాజే అయినా దానికి స్క్రీన్ ప్లే రాసుకున్నది శంకరే కాబట్టి అవసరమైన చోట మార్పులు చేర్పులు ఉండొచ్చు. పిజ్జాతో మొదలుపెట్టి కార్తీక్ సుబ్బరాజ్ శైలి టాలీవుడ్ కు సింక్ అయిన సందర్భాలు తక్కువ. గద్దలకొండ గణేష్ కి హరీష్ శంకర్ బోలెడు మార్పులు చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం విజయం సాధించింది. మక్కికి మక్కి తీసుంటే ఇంకోలా ఉండేది. సో గేమ్ చేంజర్ వచ్చేదాకా స్టోరీ మీద ఈ సస్పెన్స్ కొనసాగక తప్పదు. విడుదల చాలా దూరం ఉంది కాబట్టి ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు.
This post was last modified on November 11, 2023 2:46 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…