Movie News

సుబ్బరాజ్ మీద చరణ్ ఫ్యాన్స్ అనుమానం

నిన్న విడుదలైన జిగర్ తండ డబుల్ ఎక్స్ కి తెలుగులో ఆశించిన స్పందన లేదని కలెక్షన్లు, రివ్యూలు రెండూ స్పష్టం చేశాయి. చాలా చోట్ల కనీస ఓపెనింగ్స్ రాలేదు. అర్బన్ లో ఓ మోస్తరుగా ఓకే అనుకుంటే బిసి సెంటర్స్ లో మాత్రం నామమాత్రపు వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ టాక్. తమిళంలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది మనకనవసరం. అభిరుచుల్లో తేడాలుంటాయి కాబట్టి ఇక్కడి ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి చరణ్ అభిమానులకు ఉన్న కనెక్షన్ ఏంటంటే విషయానికి వద్దాం. గేమ్ ఛేంజర్ కు కథను ఇచ్చింది జిగర్ తాండ డబుల్ ఎక్స్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజే.

ఇక్కడ ఎందుకు టెన్షనంటే గేమ్ చేంజర్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దశాబ్దాల క్రితం బ్యాక్ డ్రాప్ తో జరుగుతుంది. అప్పటి రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, నమ్మక ద్రోహాలు వీటి చుట్టూ అల్లుకున్నారు. అప్పన్నగా రామ్ చరణ్ సన్నని మీసం, పంచెకట్టుతో కనిపిస్తాడు. జిగర్ తండలోనూ పాలిటిక్స్ టచ్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ అందులో డ్రామాని మరీ ఓవర్ గా ప్రెజెంట్ చేశారు. అడవి గిరిజనులను మోసం చేసే క్రమాన్ని ముఖ్యమంత్రి రేంజ్ లో చూపించడం అతిశయోక్తిని దాటి పోయింది. క్లైమాక్స్ అయితే మనవాళ్ళు అంత సులభంగా జీర్ణించుకోలేని రీతిలో ఉంటుంది.

ఇలాంటివి గేమ్ చేంజర్ లోనూ ఉంటాయేమోననే అనుమానం రావడం సహజమే. కాకపోతే స్టోరీ ఇచ్చింది సుబ్బరాజే అయినా దానికి స్క్రీన్ ప్లే రాసుకున్నది శంకరే కాబట్టి అవసరమైన చోట మార్పులు చేర్పులు ఉండొచ్చు. పిజ్జాతో మొదలుపెట్టి కార్తీక్  సుబ్బరాజ్ శైలి టాలీవుడ్ కు సింక్ అయిన సందర్భాలు తక్కువ. గద్దలకొండ గణేష్ కి హరీష్ శంకర్ బోలెడు మార్పులు చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం విజయం సాధించింది. మక్కికి మక్కి తీసుంటే ఇంకోలా ఉండేది. సో గేమ్ చేంజర్ వచ్చేదాకా స్టోరీ మీద ఈ సస్పెన్స్ కొనసాగక తప్పదు. విడుదల చాలా దూరం ఉంది కాబట్టి ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. 

This post was last modified on November 11, 2023 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

31 seconds ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

32 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

3 hours ago