సెప్టెంబరు 2.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగ రోజు. అది పవన్ పుట్టిన రోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండేళ్లు ఆ రోజు సాధారణంగా గడిచిపోయింది పవన్ అభిమానులకు. ఎందుకంటే ఆ రెండేళ్లు పవన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కానీ ఈ పుట్టిన రోజు సంగతి వేరు. ఒకటికి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
కాబట్టి వాటి నుంచి ఆ రోజు ఏవైనా విశేషాలు వస్తాయని అభిమానులు ఆశించడంలో తప్పు లేదు. క్రిష్ సినిమా సంగతేమో కానీ.. పది నెలల కిందట మొదలై, మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ నుంచి టీజర్ లాంటిది కచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ఓ పాట రిలీజైంది. ఇప్పుడిక రిలీజ్ చేయగలిగింది టీజర్ మాత్రమే.
ఐతే ఆ విషయాన్ని ఖరారు చేయకుండా.. సెప్టెంబరు 2న పవన్ అభిమానులకు ఏదో ఒక కానుక అయితే తప్పక ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్. WEDNESDAY అని టైప్ చేసి వెనుక ఒక హార్ట్ ‘లవ్’ సింబల్ పెట్టాడు తమన్. సెప్టెంబరు 2న బుధవారమే కావడంతో ఆ రోజు రిలీజ్ చేయబోయే ‘వకీల్ సాబ్’ విశేషం గురించే తమన్ సంకేతాలు ఇస్తున్నాడని అర్థమైపోయింది. మరి ఆ కానుక ఏంటో చూడాలి.
ఇప్పటికే 80 శాతం దాకా చిత్రీకరణ పూర్తి కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా చాలా వరకు చేసేయడం, కొన్ని నెలలుగా టీం అంతా ఖాళీగా ఉండటంతో టీజర్కు కంటెంట్ కోసం వెతుక్కోవాల్సిన పనైతే లేదు. ఒకట్రెండు రోజుల్లో టీజర్ గురించి అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశముంది. అలాగే క్రిష్ సినిమా నుంచి పవన్ ఫస్ట్ లుక్ ఏమైనా రిలీజవుతుందా అన్న ఆశతో కూడా ఉన్నారు ఫ్యాన్స్. దాని సంగతేంటో చూడాలి.
This post was last modified on August 28, 2020 8:05 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…