ఇండియా ఓటిటి రంగంలో అందులోనూ వెబ్ సిరీస్ కు సంబంధించి ట్రెండ్ సెట్టింగ్ రెస్పాన్స్ తెచ్చుకున్నవి కొన్నే. వాటిలో ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, బ్రీత్ లాంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కానీ మీర్జాపూర్ కు మాత్రం పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీడియం వేషాలతో నెట్టుకుంటూ వస్తున్న పంజాజ్ త్రిపాఠిని ఒక్కసారిగా స్టార్ ని చేసేసి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేర్చింది. రెండు భాగాలు సక్సెసయ్యాక ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కి మూడో సీజన్ రెడీ అవుతోంది. అదే క్యాస్టింగ్, టీమ్ తో ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు.
దీని కోసం వెయిటింగ్ ఏ స్థాయిలో ఉందంటే ప్రైమ్ క్లూ ఇవ్వడం భారీ ఎత్తున అభిమానులు స్పందిస్తున్నారు. మిర్జాపూర్ అనే పట్టణంలో అఖండానంద్ కుటుంబం చేసే దుర్మార్గాల వల్ల జనంతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకు నీరెత్తన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా అతని కొడుకుల ప్రవర్తన, వాళ్ళ వల్ల కథ మలుపులు తిరిగే విధానం ఓ రేంజ్ లో పేలాయి. విచ్చలవిడి వయోలిన్స్, బూతులు, అక్రమ సంబంధాల వ్యవహారాలు, డబుల్ మీనింగ్ డైలాగులు పుష్కలంగా ఉన్న మీర్జాపూర్ తెలుగు డబ్బింగ్ లోనూ ఓ రేంజ్ సంచలనం రేపింది. అందుకే సీక్వెల్ అంటే అంత క్రేజ్.
ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చూస్తే ఓటిటి వెబ్ సిరీస్ లకు జనంలో ఆసక్తి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కరోనా టైంలో గంటల తరబడి ఏకధాటిగా చూసే స్టేజి నుంచి ఇప్పుడు రివ్యూలు చదివి బాగుందంటేనే చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి సక్సెస్ అయిన టైంలో ఓటిటిలకు వాచింగ్ అవర్స్(వీక్షించే గంటలు) భారీగా ఉండి దానికి తగ్గట్టే ఆదాయం విపరీతంగా వచ్చి పడేది. కానీ ఇప్పుడు గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. మళ్ళీ మీర్జాపూర్ లాంటివి బూస్ట్ ఇస్తే తప్ప పికప్ అయ్యేలా కనిపించడం లేదు. అన్నట్టు థర్డ్ సీజన్ లో అంతకు మించి అన్న రేంజ్ లో హింస, విశృంఖలత్వం ఉంటుందట.
ఇవాళ లెనిన్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఉదయం అయిదు గంటల నుంచే షోలు మొదలైయ్యాయి. చాలా కాలం…
కొందరు నటులకు మరణం ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ళ పాత్రలు సజీవంగా ఉంటూ తరాలు గడిచినా నిత్య…
సినిమాని ఎంత బాగా తీశామో దానికి అంతే మంచి టైటిల్ పెట్టడం ఎంతో అవసరం. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన…
బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి…
జనసేన నాయకులకు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్కడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రత్యర్థులు చేస్తున్న…
తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానని…