ఇండియా ఓటిటి రంగంలో అందులోనూ వెబ్ సిరీస్ కు సంబంధించి ట్రెండ్ సెట్టింగ్ రెస్పాన్స్ తెచ్చుకున్నవి కొన్నే. వాటిలో ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, బ్రీత్ లాంటివి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కానీ మీర్జాపూర్ కు మాత్రం పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీడియం వేషాలతో నెట్టుకుంటూ వస్తున్న పంజాజ్ త్రిపాఠిని ఒక్కసారిగా స్టార్ ని చేసేసి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేర్చింది. రెండు భాగాలు సక్సెసయ్యాక ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కి మూడో సీజన్ రెడీ అవుతోంది. అదే క్యాస్టింగ్, టీమ్ తో ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు.
దీని కోసం వెయిటింగ్ ఏ స్థాయిలో ఉందంటే ప్రైమ్ క్లూ ఇవ్వడం భారీ ఎత్తున అభిమానులు స్పందిస్తున్నారు. మిర్జాపూర్ అనే పట్టణంలో అఖండానంద్ కుటుంబం చేసే దుర్మార్గాల వల్ల జనంతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకు నీరెత్తన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా అతని కొడుకుల ప్రవర్తన, వాళ్ళ వల్ల కథ మలుపులు తిరిగే విధానం ఓ రేంజ్ లో పేలాయి. విచ్చలవిడి వయోలిన్స్, బూతులు, అక్రమ సంబంధాల వ్యవహారాలు, డబుల్ మీనింగ్ డైలాగులు పుష్కలంగా ఉన్న మీర్జాపూర్ తెలుగు డబ్బింగ్ లోనూ ఓ రేంజ్ సంచలనం రేపింది. అందుకే సీక్వెల్ అంటే అంత క్రేజ్.
ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చూస్తే ఓటిటి వెబ్ సిరీస్ లకు జనంలో ఆసక్తి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు కరోనా టైంలో గంటల తరబడి ఏకధాటిగా చూసే స్టేజి నుంచి ఇప్పుడు రివ్యూలు చదివి బాగుందంటేనే చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి సక్సెస్ అయిన టైంలో ఓటిటిలకు వాచింగ్ అవర్స్(వీక్షించే గంటలు) భారీగా ఉండి దానికి తగ్గట్టే ఆదాయం విపరీతంగా వచ్చి పడేది. కానీ ఇప్పుడు గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. మళ్ళీ మీర్జాపూర్ లాంటివి బూస్ట్ ఇస్తే తప్ప పికప్ అయ్యేలా కనిపించడం లేదు. అన్నట్టు థర్డ్ సీజన్ లో అంతకు మించి అన్న రేంజ్ లో హింస, విశృంఖలత్వం ఉంటుందట.
This post was last modified on November 10, 2023 1:58 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…