బాలీవుడ్లో గత దశాబ్ద కాలంలో వేగంగా ఎదిగిన హీరోల్లో సిద్దార్థ్ మల్హోత్రా ఒకడు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, ఏక్ విలన్, షేర్షా లాంటి సినిమాలు అతడికి చాలా మంచి పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజైన షేర్షా అద్భుతమైన స్పందన తెచ్చుకుని సిద్దార్థ్ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది.
ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకున్న సిద్దార్థ్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిన మిషన్ మజ్ను నిరాశపరిచింది. ఇంకో పెద్ద సినిమా యోధ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎంతకీ ప్రేక్షకుల ముందుకు రావట్లేదు. ఈ సినిమా ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడటం గమనార్హం.
చివరగా యోధకు ప్రకటించిన రిలీజ్ డేట్ డిసెంబరు 8. ఈసారైనా పక్కాగా యోధ రిలీజవుతుందేమో అనుకుంటే.. ఆ డేట్ కూడా మార్చేశారు. ఇంకో మూడు నెలలకు పైగా వాయిదా వేసి 2024 మార్చి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ధర్మ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న చిత్రమిది. అంత పెద్ద బేనర్ తీస్తున్న సినిమా ఇన్నిసార్లు వాయిదా పడటం సిద్దార్థ్ అభిమానులకు రుచించడం లేదు.
సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. సిద్దార్థ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కుతోంది. ఇదొక ఫుల్ లెంగ్త్ యాక్షణ్ ఎంటర్టైనర్. దేశ విదేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నా బాలీవుడ్లో తనకు యోధ పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశిస్తోంది. దిశా పఠాని యోధలో మరో కథానాయికగా నటిస్తోంది.
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…