స్టార్ కిడ్స్ వ్యవహారాల్లో అభిమానులకే కాదు సగటు సామాన్య జనాలకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఇంకా సినిమాల్లోకి రాకపోయినా సరే రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తాయి. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య పబ్లిక్ లైఫ్ లోకి బాగా వస్తోంది. ఆమె నటించిన డెబ్యూ ది ఆర్చీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో ఆమెతో పాటు అగస్త్య నందా నటించాడు. ఇతను అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ గారాల వారసుడు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం పరుగులు పెడుతున్నాడు.
ఈ మధ్య వీళ్లిద్దరూ బాగా చనువుగా ఉంటున్నారని బాలీవుడ్ టాక్. ఇటీవలే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలి పార్టీ ఇచ్చాడు. దానికి సెలబ్రిటీలు భారీ ఎత్తున హాజరయ్యారు. సుహానాతో పాటు అగస్త్య కూడా వచ్చాడు. ఆ అమ్మాయి రాకతో మొదలుపెట్టి తిరిగి కారులో వెళ్లిపోయే ముందు డోరు వేసుకునే దాకా అంటిపెట్టుకునే ఉండటం మీడియా దృష్టిలో పడకుండా పోలేదు. లోపల పార్టీలో సైతం చాలా చనువుగా ఉన్నారని, అగస్త్య తల్లి శ్వేతాకు వీళ్ళ స్నేహంలోని ఘాడత ముందే తెలుసని ఇన్ సైడ్ టాక్. అయితే వీటిని బట్టే బంధాన్ని నిర్ధారించలేం కానీ ఊరికే ఇలాంటి వార్తలు పుట్టుకురావుగా.
ఇదంతా షారుఖ్ ఖాన్ కు తెలుసో లేదో కానీ మొత్తానికి టాపిక్ మాత్రం హాట్ గా మారింది. సుహానా ఖాన్ ని తెరమీద హీరోయిన్ గా పరిచయం చేసేందుకు అగ్ర నిర్మాతలు విపరీతమైన మంతనాలు చేస్తున్నారు. కళ్ళు చెదిరిపోయే గొప్ప అందగత్తె కాదు కానీ టాలెంట్, యాక్టింగ్ రెండూ పుష్కలంగా ఉన్నాయని కాస్త సానబడితే తండ్రి పేరు నిలబెట్టేలా చేయొచ్చని ఆర్చీస్ సెట్ లో పెర్ఫార్మన్స్ ని చూసినవారు అంటున్నారు. శుభమా అని ఇంకా కాలు పెట్టకుండానే సుహానా ఖాన్ మీద ప్రచారం చూసి షారుఖ్ నిట్టూరుస్తాడో లేక ఏదైనా సర్ప్రైజ్ చెబుతాడేమో వేచి చూడాలి.
This post was last modified on November 7, 2023 9:37 pm
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…