సమయానికి సెన్సార్ అయిపోయి ఉంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఈ శుక్రవారం విడుదలయ్యేది. రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా ఉన్న కారణంగా అభ్యంతరం తెలుపుతూ అధికారులు రివైజింగ్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా వర్మ తేలికగా తీసుకుని సూర్యుణ్ణి ఎవరు ఆపలేరు లాంటి రొటీన్ డైలాగులు కొట్టేశారు కానీ ఫైనల్ గా ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాలి. ఎంత సమర్ధించుకున్నా సరే వ్యూహం, ఆపై జనవరిలో రాబోయే శపథం రెండూ కూడా పొలిటికల్ అజెండాతో జగన్ ని సమర్ధిస్తూ, బాబు పవన్ లను గేలి చేసే విధంగా ఉన్నాయనేది ట్రైలర్ లోనే అర్థమైపోయింది.
నెక్స్ట్ యాత్ర 2 క్యూలో ఉంది. యాత్ర వైఎస్ఆర్ పాదయాత్రకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు ఆధారంగా చేసుకుని రూపొందిస్తే సీక్వెల్ లో ఆయన చనిపోవడం మొదలుపెట్టి జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దాకా జరిగిన సంఘటనలతో సాగుతుంది. దర్శకుడు మహి రాఘవ్ టేకింగ్, రైటింగ్ ని వర్మతో పోల్చడం రాంగవుతుంది కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే యాత్ర 2 కూడా జగన్ ని ఒక సూపర్ పొలిటికల్ పవర్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే. ఆద్యంతం తన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ జనం ఆయన మీద ఎంతగా ఆరాధనభావం పెంచుకున్నారో చూపిస్తారు.
ఇందులోనూ ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రస్తావన, ఆయా పాత్రధారులు అన్నీ ఉంటాయి. సోనియా గాంధీకి పోలి ఉన్న లుక్ చూస్తే కాంగ్రెస్ గురించి చురకలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే మహి రాఘవ్ ఇదంతా సెన్సిటివ్ గా చూపిస్తారు కానీ ఏపీ రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉన్న నేపథ్యంలో ఎవరైనా వివాదాలు లేవనెత్తితే సెన్సార్ దగ్గరో లేదా న్యాయస్థానం దగ్గరో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయిస్తే చిక్కులు రావొచ్చు. ఎందుకంటే యాత్ర 2లో వీడియో కంటెంట్ ని ప్రచారానికి వాడుకునే ఛాన్స్ ఉందనే అభ్యంతరాలు తలెత్తొచ్చుగా.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…