Movie News

వ్యూహం సమస్య యాత్ర 2కి వస్తుందా

సమయానికి సెన్సార్ అయిపోయి ఉంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఈ శుక్రవారం విడుదలయ్యేది. రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా ఉన్న కారణంగా అభ్యంతరం తెలుపుతూ అధికారులు రివైజింగ్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా వర్మ తేలికగా తీసుకుని సూర్యుణ్ణి ఎవరు ఆపలేరు లాంటి రొటీన్ డైలాగులు కొట్టేశారు కానీ ఫైనల్ గా ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాలి. ఎంత సమర్ధించుకున్నా సరే వ్యూహం, ఆపై జనవరిలో రాబోయే శపథం రెండూ కూడా పొలిటికల్ అజెండాతో జగన్ ని సమర్ధిస్తూ, బాబు పవన్ లను గేలి చేసే విధంగా ఉన్నాయనేది ట్రైలర్ లోనే అర్థమైపోయింది.

నెక్స్ట్ యాత్ర 2 క్యూలో ఉంది. యాత్ర వైఎస్ఆర్ పాదయాత్రకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలు ఆధారంగా చేసుకుని రూపొందిస్తే సీక్వెల్ లో ఆయన చనిపోవడం మొదలుపెట్టి జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దాకా జరిగిన సంఘటనలతో సాగుతుంది. దర్శకుడు మహి రాఘవ్ టేకింగ్, రైటింగ్ ని వర్మతో పోల్చడం రాంగవుతుంది కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే యాత్ర 2 కూడా జగన్ ని ఒక సూపర్ పొలిటికల్ పవర్ గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే. ఆద్యంతం తన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ జనం ఆయన మీద ఎంతగా ఆరాధనభావం పెంచుకున్నారో చూపిస్తారు.

ఇందులోనూ ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రస్తావన, ఆయా పాత్రధారులు అన్నీ ఉంటాయి. సోనియా గాంధీకి పోలి ఉన్న లుక్ చూస్తే కాంగ్రెస్ గురించి చురకలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే మహి రాఘవ్ ఇదంతా సెన్సిటివ్ గా చూపిస్తారు కానీ ఏపీ రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉన్న నేపథ్యంలో ఎవరైనా వివాదాలు లేవనెత్తితే సెన్సార్ దగ్గరో లేదా న్యాయస్థానం దగ్గరో ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎవరో ఒకరు కోర్టుని ఆశ్రయిస్తే చిక్కులు రావొచ్చు. ఎందుకంటే యాత్ర 2లో వీడియో కంటెంట్ ని ప్రచారానికి వాడుకునే ఛాన్స్ ఉందనే అభ్యంతరాలు తలెత్తొచ్చుగా. 

This post was last modified on November 7, 2023 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago