గత కొన్నేళ్లలో సినిమాల బడ్జెట్లో ఎంతగా పెరిగిపోయాయో తెలిసిందే. సినిమాల మార్కెట్ కూడా పెరిగినప్పటికీ.. బడ్జెట్లు మరీ హద్దులు దాటిపోవడంతో రిజల్ట్ తేడా కొట్టినపుడు నిర్మాతలు రిస్క్లో పడిపోతున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బడ్జెట్లు ఇలా హద్దులు దాటిపోవడానికి హీరోల పారితోషకాలు అసాధారణంగా పెరిగిపోఇడం ప్రధాన కారణమనే చర్చ కూడా నడుస్తోంది.
డిజిటల్ హక్కుల ఆదాయం పెరిగేసరికి అందుకు అనుగుణంగా హీరోలు పారితోషకాలు పెంచేసి నిర్మాతల్ని రిస్కులో పెట్టేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. తమ ప్రొడక్షన్ హౌస్లో తెరకెక్కిన కొత్త చిత్రం కోటబొమ్మాళి పీఎస్ టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హీరోల పారితోషకాలు పెరిగిపోవడం సమస్యగా మారిందన్న విషయంపై ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ అభిప్రాయాన్ని ఆయన ఖండించారు. హీరోల పారితోషకాలు మరీ ఎక్కువగా ఏమీ లేవని.. బడ్జెట్లో 20-25 శాతం మాత్రమే రెమ్యూనరేషన్ కింద హీరోలు తీసుకుంటున్నారని అరవింద్ అభిప్రాయపడ్డారు.
బడ్జెట్లు పెరుగుతున్నది హీరోల పారితోషకాల వల్ల కాదని.. ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా భారీగా తీస్తే, విజువల్గా గొప్పగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారని.. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమాను భారీగా తీసే క్రమంలో బడ్జెట్లు పెరుగుతున్నాయని ఆయనన్నారు. కేజీఎఫ్ అనే సినిమాలో హీరో గురించి మన వాళ్లకు పెద్దగా తెలియదని.. కానీ భారీగా తీయడం వల్లే ఆ సినిమా చూశారని.. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని.. హీరోల పారితోషకాలు బడ్జెట్లు పెరగడానికి కారణం కాదని ఆయన తేల్చి చెప్పారు.
This post was last modified on November 7, 2023 9:56 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…