అనసూయ భరద్వాజ్ను హీరోయిన్ అని ఎవరూ సంబోధించరు కానీ.. హీరోయిన్లకు దీటుగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ షోకు దూరమయ్యాక కొంచెం లైమ్ లైట్ నుంచి పక్కకు వెళ్లింది కానీ.. అయినా సరే అనసూయను ఎవ్వరూ ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు. తరచుగా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది అనసూయ. ఆమె ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడూ చర్చనీయాంశమే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను హీరోయిన్గా అవకాశాలు అందుకోవడానికి కారణమేంటో చెప్పింది అనసూయ. టాలీవుడ్లో పార్టీలకు వెళ్లకపోవడమే తనకు ప్రతికూలంగా మారిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. షూటింగ్స్లో నా పని నేను చేసుకుని వెళ్లిపోతుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు నేను దూరంగా ఉంటాను. ఆ కారణంగానే నేను కథానాయికగా అవకాశాలు కోల్పోయాననుకుంటా. అలాంటి పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే వాటిని నేను ఎంకరేజ్ చేయను అని అనసూయ కుండబద్దలు కొట్టింది.
అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో నటించమంటే వేరే అమ్మాయిల మధ్య తనకు గుర్తింపు రాదన్న ఉద్దేశంతో ఆ అవకాశాన్ని తిరస్కరించానని.. పవన్ కళ్యాణ్ సినిమాకే నో చెబుతావా అని తనను అప్పట్లో చాలా ట్రోల్ చేశారని అనసూయ గుర్తు చేసుకుంది. ఐతే ఒకప్పట్లా తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని తాను ఇప్పుడు ఆలోచించట్లేదని.. ఎలాంటి పాత్రతోనైనా గుర్తింపు తెచ్చుకోగలననే నమ్మకం కలిగిందని.. అందుకే తాను భిన్నమైన పాత్రలు చేయగలుగుతున్నానని అనసూయ చెప్పింది.
This post was last modified on November 5, 2023 1:54 am
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…