స్కంద సినిమా థియేటర్లలో రిలీజైనపుడు అందులోని లాజిక్ లెస్ సీన్లు.. ఓవర్ ద టాప్ యాక్షన్ ఎపిసోడ్లు.. అర్థరహితమైన కథ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు బోయపాటిని ఎలా ఆడుకున్నారో తెలిసిందే. ఈ నెగెటివ్ డిస్కషన్ల వల్లే సినిమా వీకెండ్ తర్వాత అస్సలు నిలబడలేకపోయింది. అప్పుడు బోయపాటికి ఇచ్చిన డోస్ సరిపోదని నెటిజన్లు ఇప్పుడు మళ్లీ దిగారు. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.
ఆ వచ్చిన రోజు నుంచి ఒక్కో సన్నివేశాన్ని తూర్పారబడుతూ నెటిజన్లు బోయపాటిని ఏకిపడేస్తున్నారు. ఓవైపు హీరో చేతిలో చస్తూ.. ఇంకోవైపు ఆ దృశ్యాన్ని చూస్తున్న వారిలో కూడా అదే వ్యక్తి కనిపించిన సీన్ గురించి మామూలుగా ట్రోలింగ్ జరగట్లేదు. అలాగే పొలిటికల్ సైన్స్ క్లాసులో ఉండే అమ్మాయిలు సంబంధం లేని పుస్తకాలు పట్టుకుని కనిపించిన షాట్ కూడా ఒకటి ట్రోలింగ్కు గురవుతోంది.
ఇవన్నీ చాలవని బోయపాటి ఇంకో సీన్లో మరీ అడ్డంగా దొరికేశాడు. క్లైమాక్స్ ఫైట్లో హీరో రామ్ దీప స్తంభాలు తీసుకుని విలన్ల మీద ఎటాక్ చేసే షాట్ ఒకటి ఉంటుంది. ఆ షాట్ మామూలుగా చూస్తే ఏం తేడాగా అనిపించదు. కానీ ఓటీటీలో సినిమాలు చూసే కుర్రాళ్లు మామూలు వాళ్లా? స్లోమోషన్లో ఆ షాట్ను జాగ్రత్తగా గమనించి.. ఒక చోట రామ్ స్థానంలో బోయపాటి నిలబడి ఆ షాట్ను తన మీదే షూట్ చేయించుకున్న విషయాన్ని కనిపెట్టేశారు. అచ్చం రామ్ లాగే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని బోయపాటే ఆ షాట్ లాగించేశాడు.
ఊరికే ముచ్చట తీర్చుకోవడానికి అలా చేశాడా.. ఆ సమయానికి హీరో అందుబాటులో లేడా అన్నది తెలియదు కానీ.. నెటిజన్లకు మాత్రం అడ్డంగా దొరికేసిన బోయపాటి వాళ్లకు ఆహారంగా మారిపోయాడు. ఇవన్నీ లార్డ్ బోయ థింగ్స్ అంటూ నెటిజన్లు ఈ దర్శకుడిని ఒక ఆట ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో. గతంలో గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ఒక షాట్లో హరీష్ శంకర్ సైతం పవన్ కళ్యాణ్కు డూప్గా నటించడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2023 12:41 am
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…