ఒక పెద్ద సినిమా మొదలు కాగానే అది తన కథేనంటూ ఎవరో ఒక రచయిత రచ్చ చేయడం సినిమాల్లో చివరి సీన్లో పోలీసులు రావడమంత రొటీన్. కొన్ని కొన్నిసార్లు ఆ రచయితల ఆరోపణలు రుజువవుతుంటాయి. వారికి కాస్త పారితోషికమో, లేదా టైటిల్ కార్డ్ లో చిన్న క్రెడిట్టో ఇచ్చేస్తుంటారు. సినిమా విడుదలయిన తర్వాత అలాంటి వివాదాలు తలెత్తి రచయిత ఆరోపణ రుజువయితే రాయల్టీలాంటిది చెల్లిస్తుంటారు. సుకుమార్ ‘పుష్ప’ కథ ఏమిటనేది అతనికీ, అల్లు అర్జున్కీ, ఆ చిత్రానికి పని చేసేవారికీ తప్ప ఎవరికీ తెలియకపోయినా అది తన కథేనని ఒక రచయిత ఆరోపిస్తున్నాడు.
తాను రాసిన ‘తమిళ కూలీలు’ కథను సుకుమార్ కాపీ చేసాడని అంటున్నాడు. అయితే ఇదే వెంపల్లి గంగాధర్ గతంలో ‘అరవింద సమేత’ కథ తన ‘మొండికత్తి’ కథనుంచి త్రివిక్రమ్ కాపీ చేసాడని ఆరోపించాడు. నిజంగానే అరవింద సమేతలో ‘మొండి కత్తి’ ప్రస్తావన వున్నా కానీ ఆ రెండిటి కథలకూ అసలు సంబంధం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. మరిప్పుడు సుకుమార్ సినిమాలోను తమిళ కూలీల ప్రస్తావన మినహా మరేమీ లేకపోతే ఇదీ మరుగున పడిపోతుందేమో.
ఇదిలావుంటే ఆచార్య కథ తనదే అని చెప్పిన రచయితకు కొరటాల శివ బదులిచ్చాడు. ఆచార్య కథ తన సొంతమని స్పష్టం చేసాడు. బాలీవుడ్ని నెపోటిజమ్ పీడిస్తున్నట్టు టాలీవుడ్కి ప్లాగియారిజమ్ పీడ ఎప్పటికీ వదిలేట్టు లేదు.
This post was last modified on August 28, 2020 3:03 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…