షారుఖ్ ఖాన్ సినిమా ‘డంకీ’ క్రిస్మస్ రిలీజ్ విషయంలో సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని తేలిపోయింది. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ టీజర్లో రాజ్ కుమార్ హిరాని మార్కు స్పష్టంగా కనిపించింది. వినోదానికి ఢోకా లేని సినిమాలాగే ఉంది ‘డంకీ’. కాబట్టి ‘డంకీ’ని మినిమం గ్యారెంటీ మూవీగా చెబుతున్నారు విశ్లేషకులు.
కాకపోతే ‘డంకీ’ని చూసి మరో క్రిస్మస్ సినిమా ‘సలార్’ భయపడాల్సిన పనైతే లేనట్లే ఉంది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరాని మార్కు క్లాస్ ఎంటర్టైనర్లకు ఇప్పుడు అంతగా డిమాండ్ ఉండట్లేదు. ఇప్పుడంతా మాస్, యాక్షన్ సినిమాలదే హవా. హీరో ఎలివేషన్లు, భారీ యాక్షన్ ఘట్టాలు ఉన్న.. విజువల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలే భారీ వసూళ్లు రాబడుతున్నాయి.
షారుఖ్ ఖాన్ చివరి రెండు సినిమాలు ‘పఠాన్’; జవాన్’ కథ పరంగా వీక్ అయినా సరే.. పై అంశాలన్నీ ఉండటం వల్లే అవి ఘనవిజయం సాధించాయి. ప్రధానంగా ఉత్తరాది ప్రేక్షకులు ఇలాంటివి ఎక్కువ కోరుకుంటున్నారు. నార్త్ మాస్ ఏరియాల్లో ఇలాంటి సినిమాలే బాగా ఆడుతున్నాయి. మాస్ టచ్ ఉన్న ‘గదర్-2’కు అక్కడి జనం ఎలా బ్రహ్మరథం పట్టారో తెలిసిందే.
‘సలార్’ పక్కా మాస్, యాక్షన్ సినిమా కావడంతో ఉత్తరాదిన కూడా మాస్ ఏరియాల్లో ‘డంకీ’ మీద తిరుగులేని ఆధిపత్యం చలాయించే అవకాశముంది. ‘డంకీ’కి ఎంత మంచి టాక్ వచ్చినా మెట్రో సిటీల్లో, మల్టీప్లెక్సుల వరకు బాగా ఆడొచ్చు. కానీ మిగతా చోట్ల ‘సలార్’ దూకుడును తట్టుకోవడం కష్టమే. అదే సమయంలో ‘సలార్’ మెట్రో సిటీలు, మల్టీప్లెక్సుల్లోనూ గట్టి ప్రభావమే చూపే అవకాశముంది. ‘డంకీ’లో హీరోయిజం, యాక్షన్, మాస్ అంశాలు లేకపోవడంతో ‘సలార్’ టీంకు కచ్చితంగా ప్లస్ అనడంలో సందేహం లేదు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…