మాములుగా తమిళ హీరోలు కొందరు తమ డబ్బింగ్ సినిమాలు పక్క రాష్ట్రంలో ఎంత బాగా ఆడుతున్నా కనీసం ఒక ప్రెస్ మీట్ కు వచ్చేందుకు కూడా ఇష్టపడరు. ముఖ్యంగా విజయ్, అజిత్ లాంటి వాళ్ళను ఈ క్యాటగిరీలో వేయొచ్చు. తలా అంటే ముందు నుంచి ప్రమోషన్లకు దూరం కాబట్టి ఏమో అనుకోవచ్చు. కానీ తలపతి అలా కాదు. దిల్ రాజు ఎంత ప్రయత్నించినా వారసుడు కోసం కనీసం ఒక సక్సెస్ మీట్ కి రప్పించలేకపోయాడు. లియోకి తీసుకొస్తానన్న నాగవంశీ బ్రేక్ ఈవెన్ జరిగి లాభాలు వచ్చినా సరే అదసలు గుర్తే లేదన్నట్టు విషయాన్ని సైడ్ ట్రాక్ చేశారు.
ఈ విషయంలో కార్తీని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. దీపావళికి విడుదల కాబోతున్న జపాన్ తెలుగు వెర్షన్ పబ్లిసిటీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు రోజే భాగ్యనగరానికి చేరుకొని రేడియో, వెబ్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ ఇన్ఫ్లు యెన్సర్లు ఇలా ఒకటేమిటి అందిరితో విడివిడిగా మాట్లాడుతూ జపాన్ కంటెంట్ ని జనానికి చేరవేసేందుకు కష్టపడుతున్నాడు. ముందు నుంచి స్వంత డబ్బింగ్ చెప్పుకుంటున్న కార్తీ నాగార్జునతో కలిసి ఊపిరి చేయడం ఎంత ప్లస్ అయ్యిందో చూశాం. ఆ బాండింగే అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్, జపాన్ ల పంపిణీకి ముందుకొచ్చేలా చేసింది.
ఖైదీ నుంచి కార్తీకి ఫాలోయింగ్ పెరిగింది. దిల్లీగా చేసిన పెర్ఫార్మన్స్ మన ఆడియన్స్ ఫిదా అయ్యారు. పొన్నియిన్ సెల్వన్ మరీ విసుగు రాకుండా కాపాడింది ఎవరంటే వల్లవరాయగా చేసిన కార్తీనే, జపాన్ లో డిఫరెంట్ స్లాంగ్ తో కొత్తగా ట్రై చేసిన ఈ టాలెంటెడ్ హీరో కొంత మిమిక్రి టచ్ తో తెలుగులోనూ డబ్బింగ్ చెప్పడం విశేషం. తమిళంతో సమానంగా ఇక్కడి రిలీజ్ కు ప్రాధాన్యం ఇస్తున్న కార్తీ ఖైదీ 2 కోసం చాలా వెయిట్ చేయాలని చెబుతున్నాడు. జపాన్ కు జిగర్ తండా డబుల్ ఎక్స్, టైగర్ 3తో గట్టి పోటీ ఉన్నా ఏ మాత్రం నెరవకుండా గెలుపు మాదేనని కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. చూడాలి మరి కార్తీ ఎలా మెప్పిస్తాడో.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…