ఈ శుక్రవారం రిలీజవుతున్న చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘కీడా కోలా’నే. ముఖ్యంగా యూత్ ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ఆ వర్గం ప్రేక్షకులను దర్శకుడు తరుణ్ భాస్కర్ అంతగా ఆకట్టుకున్నాడు మరి. సినిమా సినిమాకూ చాలా గ్యాప్ తీసుకుంటున్న తరుణ్.. ఎట్టకేలకు ‘కీడా కోలా’ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు.
ఇందులో స్టార్ కాస్ట్ ఏమీ లేదు. హీరో్ చైతన్య రావు జనాలకు పెద్దగా తెలియదు. ఈ చిత్రంలో హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. కేవలం తరుణ్ భాస్కర్ పేరు చూసే యూత్ ఈ సినిమాకు వెళ్తున్నారు. ట్రైలర్ చూస్తే తన మార్కు స్పష్టంగా కనిపించింది. ఒక క్రేజీ, థ్రిల్లింగ్ రైడ్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చింది. ఈ చిత్రంలో తరుణ్ నటుడిగా కూడా ఒక కీలక పాత్ర చేశాడు. తన పాత్ర కూడా క్రేజీగా ఉంటుందని అంటున్నారు.
‘కీడా కోలా’ ప్రమోషన్లను కూడా ఒంటి చేత్తో నడిపిస్తున్న తరుణ్ భాస్కర్.. తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కీడా కోలా’లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన మీద తరుణ్కు విపరీతమైన అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ ఒక ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశాడు తరుణ్. దుబాయ్ శీను, అదుర్స్, నేనింతే సినిమాల్లో బ్రహ్మి చేసిన కల్ట్ కామెడీ క్యారెక్టర్లను అతను అనుకరించాడు. ఆయా వేషాల్లో ‘కీడా కోలా’ సినిమా గురించి పంచ్ డైలాగులు పేల్చాడు.
‘‘స్లోమోషన్లో బుల్లెట్లెల్లాలె.. వివేక్ సాగర్ మ్యూజిక్తో ర్యాంప్ ఆడించాలె.. ఐ నో ద పబ్లిక్ పల్స్.. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ పీపుల్’.. ‘‘నాకితే నాకార్లేరా.. సక్సెస్ అయితే అదే హ్యాపీ’’.. లాంటి డైలాగులు సందర్భానికి తగ్గట్లు భలేగా పేలాయి. ఇలా ఒక దర్శకుడు కమెడియన్ని ఇమిటేట్ చేస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం అరుదైన విషక్ష్ం. ‘కీడా కోలా’కు ఆల్రెడీ కొన్ని పెయిడ్ ప్రిమియర్స్ పడగా.. వాటికి మంచి టాకే వచ్చింది. తరుణ్ దర్శకుడిగానే కాక నటుడిగానూ అదరగొట్టాడని అంటున్నారు.
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…