సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణం తర్వాత బాలీవుడ్ వారసులకు, వారితో సినిమాలు తీస్తోన్న వారికీ విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతోంది. ఆలియా భట్ సినిమా ‘సడక్ 2’ ట్రెయిలర్ రిలీజ్ అయితే ప్రపంచంలోనే ఎక్కువ మందికి నచ్చని ట్రెయిలర్గా యూట్యూబ్ రికార్డ్ దానికి సొంతమయింది. ఇప్పుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే సినిమా ‘కాలీ పీలీ’ టీజర్ డిస్లైకర్స్ బారిన పడింది.
ఈ టీజర్కి ఇప్పటికే 1.5 మిలియన్ డిస్లైక్స్ తెచ్చుకుంది. ఇలా డిస్లైక్స్ తో పాటు టీజర్కి వ్యూస్ కూడా భారీగానే వస్తున్నాయనుకోండి. అది వేరే సంగతి. అయితే ఆలియా, అనన్య తదితరులు నటిస్తోన్న సినిమాలకు వస్తోన్న పబ్లిక్ రియాక్షన్ వారితో సినిమాలు తీస్తోన్న వారికి కలవరం పుట్టిస్తోంది.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం తీస్తోన్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ అనన్య పాండే. మరి ఆ సినిమా వచ్చేసరికి ఈ ద్వేషం ముదిరితే దానిని పూరి ఎలా కౌంటర్ చేస్తాడో. అసలే ఈ చిత్రానికి కరణ్ జోహార్ పేరు కూడా తోడయింది. అతనిపై వున్న ద్వేషమయితే తారాస్థాయిలో వుంది కనుక మొత్తం మీద పూరి సినిమా హిందీ వెర్షన్కి ఈ హేటర్స్ బెడద తీవ్రంగా వుండేలాగుంది.
This post was last modified on August 30, 2020 9:44 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…