సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణం తర్వాత బాలీవుడ్ వారసులకు, వారితో సినిమాలు తీస్తోన్న వారికీ విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతోంది. ఆలియా భట్ సినిమా ‘సడక్ 2’ ట్రెయిలర్ రిలీజ్ అయితే ప్రపంచంలోనే ఎక్కువ మందికి నచ్చని ట్రెయిలర్గా యూట్యూబ్ రికార్డ్ దానికి సొంతమయింది. ఇప్పుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే సినిమా ‘కాలీ పీలీ’ టీజర్ డిస్లైకర్స్ బారిన పడింది.
ఈ టీజర్కి ఇప్పటికే 1.5 మిలియన్ డిస్లైక్స్ తెచ్చుకుంది. ఇలా డిస్లైక్స్ తో పాటు టీజర్కి వ్యూస్ కూడా భారీగానే వస్తున్నాయనుకోండి. అది వేరే సంగతి. అయితే ఆలియా, అనన్య తదితరులు నటిస్తోన్న సినిమాలకు వస్తోన్న పబ్లిక్ రియాక్షన్ వారితో సినిమాలు తీస్తోన్న వారికి కలవరం పుట్టిస్తోంది.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం తీస్తోన్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ అనన్య పాండే. మరి ఆ సినిమా వచ్చేసరికి ఈ ద్వేషం ముదిరితే దానిని పూరి ఎలా కౌంటర్ చేస్తాడో. అసలే ఈ చిత్రానికి కరణ్ జోహార్ పేరు కూడా తోడయింది. అతనిపై వున్న ద్వేషమయితే తారాస్థాయిలో వుంది కనుక మొత్తం మీద పూరి సినిమా హిందీ వెర్షన్కి ఈ హేటర్స్ బెడద తీవ్రంగా వుండేలాగుంది.
This post was last modified on August 30, 2020 9:44 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…