రియాలిటీ షోలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. ఎన్ని విమర్శలు, ట్రోలింగులు, కామెంట్లు వచ్చినా సరే దీన్నికొనసాగించడంలో నిర్వాహకులు, చూడటంలో ప్రేక్షకులు రాజీ పడటం లేదు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులోనే కొంత రేటింగ్స్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు చెరో సీజన్ చేశాక నాన్ స్టాప్ గా నాగార్జునే దీనికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు సీజన్లు భారీ స్పందన తెచ్చుకున్నాయి కానీ గత కొంత కాలంగా స్పీడ్ తగ్గిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ఏడో సిరీస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని డిజిటల్ టాక్.
ఇదిలా ఉండగా సీజన్ 8 కోసం స్టార్ మా సంస్థ బాలయ్యని సంప్రదించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమైతే బిగ్ బాస్ షోకి అంత కన్నా కిక్ మరొకటి ఉండదు. నిర్మొహమాటంగా, ఫిల్టర్ లేకుండా బాలకృష్ణ మాట్లాడే తీరు ఖచ్చితంగా ఈ గేమ్ ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా వీకెండ్ లో వచ్చే ఎలిమినేషన్ ఎపిసోడ్లలో బాలయ్య పార్టిసిపెంట్స్ ని క్లాసులు పీకే తీరు టిఆర్పిని ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయం. పైగా ఆయనతో ఉన్న చనువు, సందర్భాల దృష్ట్యా స్పెషల్ సెలబ్రిటీలు ఎవరు రమన్నా వస్తారు. దీంతో సహజంగానే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.
అధికారికంగా చెప్పలేదు కనక ఇప్పటికిప్పుడు ధృవీకరించలేం కానీ నిప్పులేనిది పొగరాదు కాబట్టి ఏదో చర్చ జరిగే ఉంటుంది. అన్ స్టాపబుల్ షోని బాలకృష్ణ నడిపించిన తీరు ఆహా ఓటిటికి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. అది చూసే హాట్ స్టార్ నిర్వాహకులకు హోస్ట్ ని మార్చే ఆలోచన వచ్చిందట. పైగా నాగార్జున వచ్చే ఏడాది వందో సినిమా మొదలుపెట్టబోతున్నారు. నా సామి రంగా రిలీజయ్యాక దీనికి సంబంధించిన పనులతో పాటు అన్నపూర్ణ బ్యానర్ పై వరస సినిమాలకు ప్లాన్ చేస్తారట. మరి బిగ్ బాస్ కుర్చీ నిజంగా చేతులు మారిందో లేదో తేలాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…