రియాలిటీ షోలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. ఎన్ని విమర్శలు, ట్రోలింగులు, కామెంట్లు వచ్చినా సరే దీన్నికొనసాగించడంలో నిర్వాహకులు, చూడటంలో ప్రేక్షకులు రాజీ పడటం లేదు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులోనే కొంత రేటింగ్స్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు చెరో సీజన్ చేశాక నాన్ స్టాప్ గా నాగార్జునే దీనికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు సీజన్లు భారీ స్పందన తెచ్చుకున్నాయి కానీ గత కొంత కాలంగా స్పీడ్ తగ్గిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ఏడో సిరీస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని డిజిటల్ టాక్.
ఇదిలా ఉండగా సీజన్ 8 కోసం స్టార్ మా సంస్థ బాలయ్యని సంప్రదించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమైతే బిగ్ బాస్ షోకి అంత కన్నా కిక్ మరొకటి ఉండదు. నిర్మొహమాటంగా, ఫిల్టర్ లేకుండా బాలకృష్ణ మాట్లాడే తీరు ఖచ్చితంగా ఈ గేమ్ ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా వీకెండ్ లో వచ్చే ఎలిమినేషన్ ఎపిసోడ్లలో బాలయ్య పార్టిసిపెంట్స్ ని క్లాసులు పీకే తీరు టిఆర్పిని ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయం. పైగా ఆయనతో ఉన్న చనువు, సందర్భాల దృష్ట్యా స్పెషల్ సెలబ్రిటీలు ఎవరు రమన్నా వస్తారు. దీంతో సహజంగానే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.
అధికారికంగా చెప్పలేదు కనక ఇప్పటికిప్పుడు ధృవీకరించలేం కానీ నిప్పులేనిది పొగరాదు కాబట్టి ఏదో చర్చ జరిగే ఉంటుంది. అన్ స్టాపబుల్ షోని బాలకృష్ణ నడిపించిన తీరు ఆహా ఓటిటికి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. అది చూసే హాట్ స్టార్ నిర్వాహకులకు హోస్ట్ ని మార్చే ఆలోచన వచ్చిందట. పైగా నాగార్జున వచ్చే ఏడాది వందో సినిమా మొదలుపెట్టబోతున్నారు. నా సామి రంగా రిలీజయ్యాక దీనికి సంబంధించిన పనులతో పాటు అన్నపూర్ణ బ్యానర్ పై వరస సినిమాలకు ప్లాన్ చేస్తారట. మరి బిగ్ బాస్ కుర్చీ నిజంగా చేతులు మారిందో లేదో తేలాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి.
This post was last modified on November 2, 2023 10:52 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…