రియాలిటీ షోలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. ఎన్ని విమర్శలు, ట్రోలింగులు, కామెంట్లు వచ్చినా సరే దీన్నికొనసాగించడంలో నిర్వాహకులు, చూడటంలో ప్రేక్షకులు రాజీ పడటం లేదు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులోనే కొంత రేటింగ్స్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు చెరో సీజన్ చేశాక నాన్ స్టాప్ గా నాగార్జునే దీనికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు సీజన్లు భారీ స్పందన తెచ్చుకున్నాయి కానీ గత కొంత కాలంగా స్పీడ్ తగ్గిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ఏడో సిరీస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని డిజిటల్ టాక్.
ఇదిలా ఉండగా సీజన్ 8 కోసం స్టార్ మా సంస్థ బాలయ్యని సంప్రదించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమైతే బిగ్ బాస్ షోకి అంత కన్నా కిక్ మరొకటి ఉండదు. నిర్మొహమాటంగా, ఫిల్టర్ లేకుండా బాలకృష్ణ మాట్లాడే తీరు ఖచ్చితంగా ఈ గేమ్ ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా వీకెండ్ లో వచ్చే ఎలిమినేషన్ ఎపిసోడ్లలో బాలయ్య పార్టిసిపెంట్స్ ని క్లాసులు పీకే తీరు టిఆర్పిని ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయం. పైగా ఆయనతో ఉన్న చనువు, సందర్భాల దృష్ట్యా స్పెషల్ సెలబ్రిటీలు ఎవరు రమన్నా వస్తారు. దీంతో సహజంగానే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.
అధికారికంగా చెప్పలేదు కనక ఇప్పటికిప్పుడు ధృవీకరించలేం కానీ నిప్పులేనిది పొగరాదు కాబట్టి ఏదో చర్చ జరిగే ఉంటుంది. అన్ స్టాపబుల్ షోని బాలకృష్ణ నడిపించిన తీరు ఆహా ఓటిటికి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. అది చూసే హాట్ స్టార్ నిర్వాహకులకు హోస్ట్ ని మార్చే ఆలోచన వచ్చిందట. పైగా నాగార్జున వచ్చే ఏడాది వందో సినిమా మొదలుపెట్టబోతున్నారు. నా సామి రంగా రిలీజయ్యాక దీనికి సంబంధించిన పనులతో పాటు అన్నపూర్ణ బ్యానర్ పై వరస సినిమాలకు ప్లాన్ చేస్తారట. మరి బిగ్ బాస్ కుర్చీ నిజంగా చేతులు మారిందో లేదో తేలాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి.
This post was last modified on November 2, 2023 10:52 am
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…