రియాలిటీ షోలో బిగ్ బాస్ ది ప్రత్యేక స్థానం. ఎన్ని విమర్శలు, ట్రోలింగులు, కామెంట్లు వచ్చినా సరే దీన్నికొనసాగించడంలో నిర్వాహకులు, చూడటంలో ప్రేక్షకులు రాజీ పడటం లేదు. హిందీ, తమిళంతో పోలిస్తే తెలుగులోనే కొంత రేటింగ్స్ వెనుకబడి ఉన్న మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్, నానిలు చెరో సీజన్ చేశాక నాన్ స్టాప్ గా నాగార్జునే దీనికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు సీజన్లు భారీ స్పందన తెచ్చుకున్నాయి కానీ గత కొంత కాలంగా స్పీడ్ తగ్గిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న ఏడో సిరీస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడం లేదని డిజిటల్ టాక్.
ఇదిలా ఉండగా సీజన్ 8 కోసం స్టార్ మా సంస్థ బాలయ్యని సంప్రదించినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమైతే బిగ్ బాస్ షోకి అంత కన్నా కిక్ మరొకటి ఉండదు. నిర్మొహమాటంగా, ఫిల్టర్ లేకుండా బాలకృష్ణ మాట్లాడే తీరు ఖచ్చితంగా ఈ గేమ్ ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా వీకెండ్ లో వచ్చే ఎలిమినేషన్ ఎపిసోడ్లలో బాలయ్య పార్టిసిపెంట్స్ ని క్లాసులు పీకే తీరు టిఆర్పిని ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయం. పైగా ఆయనతో ఉన్న చనువు, సందర్భాల దృష్ట్యా స్పెషల్ సెలబ్రిటీలు ఎవరు రమన్నా వస్తారు. దీంతో సహజంగానే ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.
అధికారికంగా చెప్పలేదు కనక ఇప్పటికిప్పుడు ధృవీకరించలేం కానీ నిప్పులేనిది పొగరాదు కాబట్టి ఏదో చర్చ జరిగే ఉంటుంది. అన్ స్టాపబుల్ షోని బాలకృష్ణ నడిపించిన తీరు ఆహా ఓటిటికి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. అది చూసే హాట్ స్టార్ నిర్వాహకులకు హోస్ట్ ని మార్చే ఆలోచన వచ్చిందట. పైగా నాగార్జున వచ్చే ఏడాది వందో సినిమా మొదలుపెట్టబోతున్నారు. నా సామి రంగా రిలీజయ్యాక దీనికి సంబంధించిన పనులతో పాటు అన్నపూర్ణ బ్యానర్ పై వరస సినిమాలకు ప్లాన్ చేస్తారట. మరి బిగ్ బాస్ కుర్చీ నిజంగా చేతులు మారిందో లేదో తేలాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి.
This post was last modified on November 2, 2023 10:52 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…