మూవీ లవర్స్ శివపుత్రుడుని మర్చిపోవడం అసాధ్యం. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ డిఫరెంట్ డ్రామాలో చియాన్ విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మాటలే లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్లతో పాత్రను నిలబెట్టిన తీరు ఎన్ని అవార్డులు తెచ్చిందో లెక్క బెట్టడం కష్టం. సూర్య లొడలొడ వాగుతూ ఉన్నా కూడా విక్రమే మనల్ని ఎక్కువ వెంటాడుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ అంత ఇంటెన్సిటీతో మూగ పాత్రను పోషించలేదు.
దీని కన్నడ రీమేక్ లో ఉపేంద్ర లాంటి విలక్షణ నటుడు ఆ క్యారెక్టర్ చేసి చాలా బాగా నటించినా సరే విక్రమ్ ని మరిపించలేకపోయాడు. ఇప్పుడు తంగలాన్ లో మరో సాహసం చేయబోతున్నాడు. అసలు తిన్నాడా లేదా అనిపించే దేహంతో కరుడు కట్టిన బాడీ లాంగ్వేజ్ తో చాలా క్రూరంగా కనిపించబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో విక్రమ్ పాత్రకు మాటలు ఉండవు.
ఆ విషయాన్నీ స్వయంగా తనే తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పేయడంతో షాక్ తినడం అభిమానులు, మీడియా వంతైంది. అదేంటి అంత అద్భుతమైన పాత్ర చేసి దాన్ని మూగగా చూపిస్తామంటే ఆడియన్స్ ఒప్పుకుంటారా. కానీ చియాన్ మాత్రం చాలా ధీమాగా తంగలాన్ ప్రపంచం కెజిఎఫ్, కాంతార, బాహుబలిలను మించి ఉంటుందని చెబుతున్నాడు. సో ఫ్యాన్స్ మానసికంగా మాటలే లేని విక్రమ్ ని చూసేందుకు రెడీ కావాల్సిందే.
ఇవాళ వదిలిన టీజర్ లోనూ మొత్తం సైలెంట్ గా కేవలం జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లాగించేశారు. చెన్నై టాక్ ప్రకారం తంగలాన్ నాగరిక భాష తెలియని ఒక ఆటవిక జాతి దశాబ్దాల క్రితం తమ కొండల్లో దాగి ఉన్న విలువైన బంగారాన్ని కాపాడుకోవడం చేసే యుద్ధం ఆధారంగా దర్శకుడు పా రంజిత్ తీర్చిదిద్దాడట. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని, థియేటర్ నుంచి బయటికి వచ్చాక చాలా కాలం వెంటాడేలా తీశాడట. ఇంతగా ఊరిస్తున్నారంటే జనవరి 26 ఫస్ట్ షోనే చూసేయాలి.
This post was last modified on November 1, 2023 10:38 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…