భారతీయ సినిమా ప్రేమికుల్ని అత్యంత బాధ పెట్టిన మరణాల్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఒకటి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ‘యం.ఎస్.ధోని’ సహా పలు చిత్రాలతో యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నటుడు.. ఆత్మహత్య చేసుకుని అర్ధంతరంగా తనువు చాలిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ముందు అతడిది అనుమానాస్పద మరణంగా భావించినప్పటికీ.. అందులో కుట్ర కోణం ఏమీ లేదని, సుశాంత్ తనకు తానే ప్రాణం తీసుకున్నాడని పోలీసులు తేల్చారు.
కెరీర్ ఆశాజనకంగానే ఉన్నప్పటికీ సుశాంత్ ఎందుకలా ప్రాణం తీసుకున్నాడన్నది అంతుబట్టని విషయంగానే మిగిలిపోయింది. అప్పటి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ.. తన పాత్ర ఏమీ లేదని వెల్లడైంది. సుశాంత్ గతంలో టీవీ నటుడిగా ఉన్న సమయంలో అంకితా లోఖండే అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
సుశాంత్ మరణించిన సమయంలో అంకితా గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. రియాతో ఉన్నప్పటి కంటే అంకితాతో ప్రేమలో ఉన్నప్పుడే సుశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడని మాట్లాడుకున్నారు సామాజిక మాధ్యమాల్లో. ఐతే తమ ప్రేమ విఫలం కావడంలో తన పాత్ర ఏమీ లేదని అంటోంది అంకితా. సుశాంతే అప్పట్లో బ్రేకప్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
‘‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. అతను విడిపోదాం అన్నపుడు నేను షాకయ్యా. రాత్రికి రాత్రే నా జీవితంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. సుశాంత్ బ్రేకప్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి నిర్ణయాన్ని తప్పుబట్టాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ తర్వాత వేరొకరితో రిలేషన్షిప్లోకి వెళ్లడానికి భయపడ్డా’’ అని అంకితా చెప్పింది. టీవీ సీరియళ్లలో నటించేటపుడు అంకితాతో ప్రేమలో ఉన్న సుశాంత్.. సినిమాల్లోకి వెళ్లి ఒక స్థాయి అందుకున్నాక అంకితకు దూరమైనట్లు బాలీవుడ్లో చర్చ నడిచింది.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…