కళ్యాణ్ రామ్ డెవిల్ నవంబర్ 24 విడుదల నుంచి తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్లే వాయిదా వేస్తున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక స్పై జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నందమూరి హీరోకి జోడిగా నటించింది. రిలీజ్ దగ్గరగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు చేపట్టకపోవడం పట్ల గత కొద్దిరోజులుగా అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. ఇప్పుడవి నిజమై పోస్ట్ పోన్ కబురు వచ్చేసింది. కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు.
సరే అసలీ వాయిదా వెనుక మతలబేంటనే దాని మీద ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. డెవిల్ మొదలుపెట్టినప్పుడు దానికి దర్శకుడు నవీన్ మేడారం. రచనతో సహా పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. కానీ తెరవెనుక ఏం జరిగిందో కానీ కొన్ని నెలల క్రితం నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ గా తన పేరు వేసుకుని ప్రమోషన్లు షురూ చేశారు. నవీన్ ఎందుకు తప్పుకున్నాడనే దాని గురించి ఈ రోజుకీ క్లారిటీ లేదు. మరోవైపు కళ్యాణ్ రామ్ ఈ వ్యవహారాల పట్ల సైలెంట్ గా ఉన్నాడు. ఏదైనా పాట ప్రమోషన్ ఉంటే దాన్ని ట్వీట్ చేయడం తప్ప ఇంకెలాంటి యాక్టివిటీ లేదు.
ప్రొడ్యూసర్ గా అభిషేక్ నామాకు ఎంత అనుభవమున్నా దర్శకుడిగా గ్రిప్ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ అందులోనూ గ్రాఫిక్స్ కి సంబందించిన వ్యవహారం కాబట్టి పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయట. ఫైనల్ కాపీ దగ్గరలో సిద్ధమయ్యే సూచనలు లేకపోవడంతో వాయిదా తప్ప వేరే మార్గం లేకపోయిందని వినికిడి. ఇది పక్కాగా తెలుసుకున్నాకే ఆదికేశవ, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లు నవంబర్ 24ని తీసేసుకున్నాయి. అసలే డిసెంబర్, జనవరిలో ఏ ఒక్క వారం ఖాళీగా లేదు. మొత్తం భారీ చిత్రాలతో నిండిపోయాయి. మరి డెవిల్ ఫిబ్రవరి లేదా ఆపై నెలల్లో తప్ప ముందుగా వచ్చే ఛాన్స్ దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తోంది.
This post was last modified on November 1, 2023 5:05 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…