హీరో ఎవరైనా ఎలాంటి జానర్ లో సినిమా నిర్మించినా దాని ప్రమోషన్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఓపెనింగ్స్ నుంచే దెబ్బ పడటం మొదలవుతుంది. ఈ మధ్య తక్కువ బడ్జెట్ లో తీసిన చిన్న చిత్రాలు సైతం పబ్లిసిటీ విషయంలో ఖర్చు ఎక్కువవుతున్నా సరే వెనుకడుగు వేయకుండా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇంకో పదే రోజుల్లో వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ ఆదికేశవ నవంబర్ 10 విడుదల కాబోతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామ్యం కావడంతో ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ ఉంటుంది. అయితే రిలీజ్ ఇంత దగ్గరగా ఉన్నా సరే సౌండ్ మాత్రం సరిపోవడం లేదు.
ఆదికేశవకు ఇప్పటిదాకా టీజర్, లిరికల్ వీడియోస్ వచ్చాయి తప్పించి ట్రైలర్ ఇంకా వదల్లేదు. ఇంకో వారంలో ఆ లాంఛనం కూడా చేస్తారు కానీ ముందుగా ప్లాన్ చేయడం వల్ల జనాలకు త్వరగా రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. వైష్ణవ్ తేజ్ బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. కొండ పొలం, రంగ రంగ వైభవంగ రెండు డిజాస్టర్స్ పడ్డాక మార్కెట్ రిస్క్ లో పడింది. ఎంత మేనల్లుడైనా సరే మెగా ఫ్యాన్స్ అందరూ పొలోమని మొదటి రోజు థియేటర్లకు పరిగెత్తడం లేదు. అది వైష్ణవ్ కూ తెలుసు. ఆదికేశవ హిట్టు కొడితేనే తిరిగి ట్రాక్ లో పడొచ్చు. లేదంటే తర్వాత సినిమాలకు రిస్క్ అవుతుంది.
శ్రీలీల హీరోయిన్ కావడం ఆదికేశవకు గ్లామర్ పరంగా ప్లస్ అవుతున్నా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తీసుకున్న టెంపుల్ బ్యాక్ డ్రాప్ ని వీలైనంత ఎక్కువ హైలైట్ చేయాలి. అసలే టీజర్ వచ్చిన టైంలో ఆచార్య షేడ్స్ కనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మళ్ళీ అలా వినిపించకూడదంటే ట్రైలర్ తో పాటు పోస్టర్లు మాట్లాడాలి. లీలమ్మో పాట తప్ప యూట్యూబ్ లోనూ దీనికి సంబంధించిన ఏ కంటెంట్ లేదు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సైతం హైలైట్ కావాలి. అసలే టైగర్ 3, జపాన్, జిగర్ తండా లాంటి డబ్బింగ్ మూవీస్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. వాటిని తక్కువంచనా వేయకుండా ఆదికేశవ పోరాడాల్సి ఉంటుంది.
This post was last modified on October 31, 2023 4:04 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…