హీరో ఎవరైనా ఎలాంటి జానర్ లో సినిమా నిర్మించినా దాని ప్రమోషన్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఓపెనింగ్స్ నుంచే దెబ్బ పడటం మొదలవుతుంది. ఈ మధ్య తక్కువ బడ్జెట్ లో తీసిన చిన్న చిత్రాలు సైతం పబ్లిసిటీ విషయంలో ఖర్చు ఎక్కువవుతున్నా సరే వెనుకడుగు వేయకుండా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇంకో పదే రోజుల్లో వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ ఆదికేశవ నవంబర్ 10 విడుదల కాబోతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామ్యం కావడంతో ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ ఉంటుంది. అయితే రిలీజ్ ఇంత దగ్గరగా ఉన్నా సరే సౌండ్ మాత్రం సరిపోవడం లేదు.
ఆదికేశవకు ఇప్పటిదాకా టీజర్, లిరికల్ వీడియోస్ వచ్చాయి తప్పించి ట్రైలర్ ఇంకా వదల్లేదు. ఇంకో వారంలో ఆ లాంఛనం కూడా చేస్తారు కానీ ముందుగా ప్లాన్ చేయడం వల్ల జనాలకు త్వరగా రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. వైష్ణవ్ తేజ్ బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. కొండ పొలం, రంగ రంగ వైభవంగ రెండు డిజాస్టర్స్ పడ్డాక మార్కెట్ రిస్క్ లో పడింది. ఎంత మేనల్లుడైనా సరే మెగా ఫ్యాన్స్ అందరూ పొలోమని మొదటి రోజు థియేటర్లకు పరిగెత్తడం లేదు. అది వైష్ణవ్ కూ తెలుసు. ఆదికేశవ హిట్టు కొడితేనే తిరిగి ట్రాక్ లో పడొచ్చు. లేదంటే తర్వాత సినిమాలకు రిస్క్ అవుతుంది.
శ్రీలీల హీరోయిన్ కావడం ఆదికేశవకు గ్లామర్ పరంగా ప్లస్ అవుతున్నా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తీసుకున్న టెంపుల్ బ్యాక్ డ్రాప్ ని వీలైనంత ఎక్కువ హైలైట్ చేయాలి. అసలే టీజర్ వచ్చిన టైంలో ఆచార్య షేడ్స్ కనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మళ్ళీ అలా వినిపించకూడదంటే ట్రైలర్ తో పాటు పోస్టర్లు మాట్లాడాలి. లీలమ్మో పాట తప్ప యూట్యూబ్ లోనూ దీనికి సంబంధించిన ఏ కంటెంట్ లేదు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సైతం హైలైట్ కావాలి. అసలే టైగర్ 3, జపాన్, జిగర్ తండా లాంటి డబ్బింగ్ మూవీస్ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. వాటిని తక్కువంచనా వేయకుండా ఆదికేశవ పోరాడాల్సి ఉంటుంది.
This post was last modified on October 31, 2023 4:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…