మాములుగా ఒక దర్శకుడికి భారీ డిజాస్టర్ పడితే వెంటనే ఇంకో పెద్ద హీరోతో సినిమా సెట్ కావడం అంత సులభం కాదు, ఉదాహరణకు శ్రీకాంత్ అడ్డాలనే తీసుకుంటే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో బ్రహ్మోత్సవం చేస్తే దాని ఫలితం దెబ్బకు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీకి దూరంగా గడపాల్సి వచ్చింది. తిరిగి వచ్చి పెదకాపు 1తో దాన్ని నిలబెట్టుకోలేకపోవడం వేరే విషయం. కానీ సురేందర్ రెడ్డికి మాత్రం ఎక్కడో సుడి ఉంది. అఖిల్ కెరీర్ లో దారుణమైన ఫలితమందుకున్న మూవీగా ఏజెంట్ కి ఎంత చెడ్డపేరు వచ్చిందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేశామని నిర్మాతే చెప్పాడు.
అంత ఫ్లాప్ చూశాక కూడా సురేందర్ రెడ్డికి మంచి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. నెలల క్రితమే పూజా కార్యక్రమాలు చేసి ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇంకో వైపు వెంకటేష్ నాగ చైతన్య కాంబినేషన్ కు సరిపడా ఒక కథని సురేష్ బాబు బృందానికి వినిపించి పాజిటివ్ సిగ్నల్ తెచ్చుకున్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతోంది. వెంకటేష్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. సంక్రాంతి తర్వాత లాక్ చేద్దామని అన్నారట. ఇవిలా ఉండగా తమిళ హీరో విక్రమ్ కూ ఒక స్టోరీ చెప్పిన సూరి అక్కడా సానుకూల స్పందన దక్కించుకున్నాడట.
పక్కా ప్లానింగ్ తో సురేందర్ రెడ్డి హీరోలను కలుస్తున్న తీరు బాగుంది. వీటిలో ఏది ముందు మొదలవుతుందని ఇప్పుడే చెప్పలేం కానీ ఏజెంట్ తర్వాత నిరాశ చెందకుండా వెంటనే పరుగులు పెట్టడం మంచిదే. సైరా నరసింహారెడ్డి సైతం సూరికి ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్ళీ కిక్, రేస్ గుర్రం, అతనొక్కడే లాంటి మాస్, యాక్షన్, కామెడీ కలగలిసిన ఎంటర్ టైనర్స్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అన్నట్టు రవితేజ కోసం కూడా సూరి ట్రై చేస్తున్నాడని మరో టాక్. వీటిలో ఏ రెండు వర్కౌట్ అయినా చాలు ఒక్కసారిగా స్టార్ హీరోలతో కాంబోలు సెట్ చేసుకోవచ్చు.
This post was last modified on October 30, 2023 3:34 pm
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…