మొన్న దసరా పండక్కు దాదాపు పెద్ద హీరోల అప్డేట్స్ అన్ని వచ్చాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న సినిమాల తాలూకు పోస్టర్లో లోగోలో ఏవో ఒకటి ఫ్యాన్స్ కోసం నిర్మాణ సంస్థలు పంచుకున్నాయి. ఇంకా షూటింగ్ మొదలుకాని మెగా 156 సైతం పాట రికార్డింగ్ తో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఒక్క హరిహర వీరమల్లు మాత్రం పూర్తిగా మిస్ కావడం అభిమానులు గుర్తించకుండా పోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి నుంచి స్పెషల్ పోస్టర్లు వచ్చాయి తప్పించి ఆయుధం చాలా కీలకంగా వ్యవహరించే వీరమల్లు నుంచి ఎలాంటి స్టిల్ రాకపోవడం ఫ్యాన్స్ ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
నెలల తరబడి దర్శకుడు క్రిష్ మౌనంగా ఉన్నారు. నిర్మాత ఏఎం రత్నం తప్పని పరిస్థితుల్లో రూల్స్ రంజన్, 7జి బృందావన్ కాలనీ ఈవెంట్లలో ఏదో మొక్కుబడిగా వచ్చే ఏడాది రిలీజన్నారు కానీ దాని సూచనలు దరిదాపుల్లో కూడా లేవు. పవన్ ఇంకో మూడు నాలుగు నెలల్లో ప్రచారంలో బిజీ అయిపోతాడు. జనసేన టిడిపి కలయిక నేపథ్యంలో ఈసారి షెడ్యూల్ చాలా టైట్ గా ఉండబోతోంది. స్వంత పార్టీ అభ్యర్థుల కోసం తిరుగుతూనే మరోవైపు తెలుగుదేశం కాండిడేట్ల కోసం కూడా క్యాంపైన్లు చేయాల్సి ఉంటుంది. ఇంత టఫ్ సిచువేషన్ లో పవన్ ఓజి, ఉస్తాద్ లో ఒక్కటి పూర్తి చేసినా గొప్పే.
ఎలా చూసుకున్న హరిహర వీరమల్లు 2024 వేసవి తర్వాత బాలన్స్ షూటింగ్ కు వెళ్లేలా ఉంది తప్ప అంతకన్నా ముందు ఛాన్స్ లేనట్టే. క్రిష్ మాత్రం అనుష్క కోసం ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకుని ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టేనని ఇన్ సైడ్ టాక్. స్వీటీ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు చిరంజీవి వసిష్ఠ సినిమాలు చేసేందుకు సుముఖంగా ఉంది. ఒప్పుకున్నది లేనిది అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం. అసలు ఫ్యాన్సే మర్చిపోయేలా హరిహర వీరమల్లుని సైడ్ ట్రాక్ పట్టించడం అనూహ్యం. పవన్ మొదటి ప్యాన్ ఇండియా మూవీగా మొదట్లో ఉన్న హైప్ ఇప్పుడు నీరుగారిపోయింది.
This post was last modified on October 29, 2023 6:27 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…