సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని ఏం మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా.. ఏం షేర్ చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. పోలీసులు కొంచెం ఫోకస్ చేశారంటే ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఇప్పుడు తెలుగు ట్విట్టర్లో జరిగిన ఒక పరిణామం చూస్తే.. అక్కడ వెర్రి వేషాలు వేసే వాళ్లందరికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి పర్సనల్ వీడియోలు షేర్ చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో చెప్పడానికి ఒక తాజా ఉదంతం ఉదాహరణ.
తెలుగు ట్విట్టర్లో సినిమాల గురించి పోస్టులు పెడుతూ.. ఫ్యాన్ వార్స్లో భాగం అయ్యే ఎంబీ రమేష్ నాయక్ అనే కుర్రాడు.. తాజాగా ఒక పోస్టు పెట్టాడు. ఒక యంగ్ అమ్మాయికి సంబంధించిన వీడియో ఉందని.. ఆ వీడియో కావాలంటే 50 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తనకు షేర్ చేయాలని అతను పోస్టు పెట్టాడు. దీనికి స్పందించి బోలెడంతమంది నెటిజన్లు అతడికి డబ్బులు పంపారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.
సైబర్ క్రైమ్ వాళ్లు ఆ కుర్రాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ కుర్రాడు ఇంతకుముందు కూడా ఇలాంటి పోస్టులు పెట్టినట్లు తేలడంతో సోషల్ మీడియా డేటా అంతా బయటికి తీస్తున్నారు పోలీసులు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లందరిలో గుబులు మొదలైంది. ఇలాంటి వ్యక్తుల గురించి చాలామంది రిపోర్ట్ చేస్తూ.. పోస్టులు సేవ్ చేయడం, స్క్రీన్ షాట్లు తీయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లందరికీ ఇది హెచ్చరికగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల మీద పోలీసులు ప్రెస్ మీట్లు లాంటివి పెట్టి నెటిజన్లను అలెర్ట్ చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…