సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని ఏం మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా.. ఏం షేర్ చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. పోలీసులు కొంచెం ఫోకస్ చేశారంటే ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఇప్పుడు తెలుగు ట్విట్టర్లో జరిగిన ఒక పరిణామం చూస్తే.. అక్కడ వెర్రి వేషాలు వేసే వాళ్లందరికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి పర్సనల్ వీడియోలు షేర్ చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో చెప్పడానికి ఒక తాజా ఉదంతం ఉదాహరణ.
తెలుగు ట్విట్టర్లో సినిమాల గురించి పోస్టులు పెడుతూ.. ఫ్యాన్ వార్స్లో భాగం అయ్యే ఎంబీ రమేష్ నాయక్ అనే కుర్రాడు.. తాజాగా ఒక పోస్టు పెట్టాడు. ఒక యంగ్ అమ్మాయికి సంబంధించిన వీడియో ఉందని.. ఆ వీడియో కావాలంటే 50 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తనకు షేర్ చేయాలని అతను పోస్టు పెట్టాడు. దీనికి స్పందించి బోలెడంతమంది నెటిజన్లు అతడికి డబ్బులు పంపారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.
సైబర్ క్రైమ్ వాళ్లు ఆ కుర్రాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ కుర్రాడు ఇంతకుముందు కూడా ఇలాంటి పోస్టులు పెట్టినట్లు తేలడంతో సోషల్ మీడియా డేటా అంతా బయటికి తీస్తున్నారు పోలీసులు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లందరిలో గుబులు మొదలైంది. ఇలాంటి వ్యక్తుల గురించి చాలామంది రిపోర్ట్ చేస్తూ.. పోస్టులు సేవ్ చేయడం, స్క్రీన్ షాట్లు తీయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లందరికీ ఇది హెచ్చరికగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల మీద పోలీసులు ప్రెస్ మీట్లు లాంటివి పెట్టి నెటిజన్లను అలెర్ట్ చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 29, 2023 12:01 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…