సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని ఏం మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా.. ఏం షేర్ చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. పోలీసులు కొంచెం ఫోకస్ చేశారంటే ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఇప్పుడు తెలుగు ట్విట్టర్లో జరిగిన ఒక పరిణామం చూస్తే.. అక్కడ వెర్రి వేషాలు వేసే వాళ్లందరికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి పర్సనల్ వీడియోలు షేర్ చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో చెప్పడానికి ఒక తాజా ఉదంతం ఉదాహరణ.
తెలుగు ట్విట్టర్లో సినిమాల గురించి పోస్టులు పెడుతూ.. ఫ్యాన్ వార్స్లో భాగం అయ్యే ఎంబీ రమేష్ నాయక్ అనే కుర్రాడు.. తాజాగా ఒక పోస్టు పెట్టాడు. ఒక యంగ్ అమ్మాయికి సంబంధించిన వీడియో ఉందని.. ఆ వీడియో కావాలంటే 50 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తనకు షేర్ చేయాలని అతను పోస్టు పెట్టాడు. దీనికి స్పందించి బోలెడంతమంది నెటిజన్లు అతడికి డబ్బులు పంపారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.
సైబర్ క్రైమ్ వాళ్లు ఆ కుర్రాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ కుర్రాడు ఇంతకుముందు కూడా ఇలాంటి పోస్టులు పెట్టినట్లు తేలడంతో సోషల్ మీడియా డేటా అంతా బయటికి తీస్తున్నారు పోలీసులు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లందరిలో గుబులు మొదలైంది. ఇలాంటి వ్యక్తుల గురించి చాలామంది రిపోర్ట్ చేస్తూ.. పోస్టులు సేవ్ చేయడం, స్క్రీన్ షాట్లు తీయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లందరికీ ఇది హెచ్చరికగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల మీద పోలీసులు ప్రెస్ మీట్లు లాంటివి పెట్టి నెటిజన్లను అలెర్ట్ చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 29, 2023 12:01 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…