సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఇక్కడ ముఖానికి ముసుగు వేసుకుని ఏం మాట్లాడినా.. ఏ పోస్టు పెట్టినా.. ఏం షేర్ చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. పోలీసులు కొంచెం ఫోకస్ చేశారంటే ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఇప్పుడు తెలుగు ట్విట్టర్లో జరిగిన ఒక పరిణామం చూస్తే.. అక్కడ వెర్రి వేషాలు వేసే వాళ్లందరికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి పర్సనల్ వీడియోలు షేర్ చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో చెప్పడానికి ఒక తాజా ఉదంతం ఉదాహరణ.
తెలుగు ట్విట్టర్లో సినిమాల గురించి పోస్టులు పెడుతూ.. ఫ్యాన్ వార్స్లో భాగం అయ్యే ఎంబీ రమేష్ నాయక్ అనే కుర్రాడు.. తాజాగా ఒక పోస్టు పెట్టాడు. ఒక యంగ్ అమ్మాయికి సంబంధించిన వీడియో ఉందని.. ఆ వీడియో కావాలంటే 50 రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తనకు షేర్ చేయాలని అతను పోస్టు పెట్టాడు. దీనికి స్పందించి బోలెడంతమంది నెటిజన్లు అతడికి డబ్బులు పంపారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది.
సైబర్ క్రైమ్ వాళ్లు ఆ కుర్రాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ కుర్రాడు ఇంతకుముందు కూడా ఇలాంటి పోస్టులు పెట్టినట్లు తేలడంతో సోషల్ మీడియా డేటా అంతా బయటికి తీస్తున్నారు పోలీసులు. దీంతో ముందు వెనుక చూసుకోకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్లందరిలో గుబులు మొదలైంది. ఇలాంటి వ్యక్తుల గురించి చాలామంది రిపోర్ట్ చేస్తూ.. పోస్టులు సేవ్ చేయడం, స్క్రీన్ షాట్లు తీయడం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించే వాళ్లందరికీ ఇది హెచ్చరికగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల మీద పోలీసులు ప్రెస్ మీట్లు లాంటివి పెట్టి నెటిజన్లను అలెర్ట్ చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on October 29, 2023 12:01 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…