లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకో ఆరు నెలలు ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. థియేటర్లు పున:ప్రారంభమయ్యాక కూడా కొంత కాలం పాటు ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఉండదంటున్నారు.
ఈ నేపథ్యంలో చిన్న సినిమాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అప్పటి వరకు వడ్డీల భారం మోయడం కన్నా ఎంత ఆదాయం వస్తే అంత చాలనుకుని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు. తమిళంలో ఇలా రిలీజ్ కాబోతున్న తొలి సినిమాగా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్ మగల్ వందాల్’ సినిమా ప్రచారంలోకి వచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే ఆ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించాడు.
కానీ ఈ ప్రకటన తమిళనాడు థియేటర్ల సంఘానికి నచ్చట్లేదు. జ్యోతిక సినిమాను ప్రైమ్లో విడుదల చేయడంపై ఆ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం రూపొందించిన సినిమాను నేరుగా ఓటీటీల్లో ఎలా రిలీజ్ చేస్తారని ఆ సంఘం ప్రశ్నించింది. తమ మాట కాదని జ్యోతిక సినిమాను ప్రైమ్లో రిలీజ్ చేస్తే.. భవిష్యత్తులో సూర్య సినిమాలతో పాటు అతడి నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నుంచి వచ్చే ఏ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆ సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ఇంతకుముందు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ను నేరుగా డీటీహెచ్ల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించగా అప్పుడు కూడా తమిళనాడు థియేటర్ల సంఘమే అడ్డు పడింది. చివరికి వాళ్ల ఒత్తిడికి కమల్ తలొగ్గక తప్పలేదు. మరి ఇప్పుడు జ్యోతిక సినిమా నిర్మాత ఏం చేస్తాడో చూడాలి. ఇలా ఒక సినిమా రిలీజై మంచి స్పందన రాబట్టుకుంటే వరుసబెట్టి చాలా సినిమాలు రిలీజవుతాయని.. దీంతో భవిష్యత్తులో తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని థియేటర్ల యజమానులు కంగారు పడుతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on April 25, 2020 5:14 pm
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…