కొన్నిసార్లు ఏది ఎలా వైరలవుతుందో ముందే ఊహించలేం. అది అనుకోకుండా సినిమా ప్రమోషన్ కు చాలా ఉపయోగపడుతుంది. విజయ్ దేవరకొండ రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ టీజర్ లోని ఒక డైలాగ్ హఠాత్తుగా సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ వీడియో చివరిలో మగాడని నిరూపించుకోవడానికి ఐరన్ వంచాలా ఏంటి అనే మాటని వివిధ స్టార్ హీరోల ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ల సీన్లను లిప్ సింక్ చేసి వాటిని షేర్ చేస్తున్నారు. మహేష్ భరత్ అనే నేను, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, తారక్ అరవింద సమేత, ప్రభాస్ మిర్చి ఇలా అన్నిరకాలుగా వాడుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది విజయ్ దృష్టికి కూడా వెళ్ళింది. ఇన్స్ టా స్టోరీలో ఏం జరుగుతోంది ఇంటర్నెట్ అంటూ ప్రశ్నిస్తూ ఐరన్ వంచాలా ఏంటి హాష్ టాగ్ ఒకటి పెట్టాడు. ఫ్యామిలీ స్టార్ మాస్ మసాలా సినిమా కాకపోయినా ఈ రకమైన పబ్లిసిటీ తెచ్చుకోవడం విశేషమే. ఖుషి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ మీదే ఉన్నాయి. సర్కారు వారి పాట తర్వాత మళ్ళీ తన ట్రాక్ రికార్డుని ప్రూవ్ చేసుకోవాలనే టార్గెట్ తో ఉన్న దర్శకుడు పరశురామ్ మళ్ళీ గీత గోవిందం కాంబోని రిపీట్ చేస్తున్నాడు. టీజర్ వచ్చాక బిజినెస్ పరంగా క్రేజ్ ఎక్కువయ్యిందని ట్రేడ్ టాక్.
ఏదైతేనేం పుణ్యం పురుషార్థం దక్కడం ముఖ్యం. ఇప్పుడీ ఇరాన్ వంచాలా ఏంటితో అదేదో ఫ్రీగా పైసా ఖర్చు లేకుండా జరిగిపోతోంది. ముందు దీన్ని కొందరు నెగటివ్ గానే స్టార్ట్ చేశారని, విజయ్ దేవరకొండ తొలుత చూసి లైట్ తీసుకున్నా ఆ తర్వాత మెల్లగా ఇది పాజిటివ్ గా ట్రెండ్ అయిపోవడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ లో విజయ్ పిల్లల తండ్రిగా కనిపిస్తున్నాడు. గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, హనుమాన్, లాల్ సలామ్, అయలన్ తో పోటీ ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో పండగని వదిలేది లేదంటున్నారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…