కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులకు ఊరట కలిగిస్తూ గేమ్ ఛేంజర్ మొదటి ఆడియో సింగల్ ని దీపావళికి విడుదల చేస్తామని ఇటీవలే దసరా పండగ సందర్భంగా ఎస్విసి టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సాంగ్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్ మెంట్ అధిక శాతం చరణ్ ఫ్యాన్స్ లో లేదు. కారణం లీకైన టైంలోనే హై క్వాలిటీలో దాన్ని పూర్తిగా వినేశారు కాబట్టి. దిల్ రాజు బృందం వెంటనే మేల్కొని ఆన్ లైన్ లో ఆ పాట లేకుండా చూసుకుంది కానీ ఆలోపే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో అది భద్రంగా సేవ్ అయిపోయింది. అసలు సవాల్ ఇప్పుడు రాబోతోంది.
ఆడియో ఎలా ఉందనే దానికంటే లిరికల్ వీడియోలో చూపించే విజువల్స్ ఎలా థ్రిల్ చేస్తాయనే దాని మీద ఫ్యాన్స్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ కాబట్టి అందులో నాటు నాటు తప్ప ఇంకెక్కడా డాన్సు చేసే అవకాశం దొరకలేదు. హీరోయిన్ అలియా భట్ ఉన్నప్పటికీ తనతో లవ్ ట్రాక్ కానీ, కాలు కదిపి నృత్యం చేయడం కానీ ఏమి లేవు. ఆ కరువుని గేమ్ ఛేంజర్ తీరుస్తుందని వాళ్ళ ఆశ. కేవలం ఈ ఒక్క పాట చిత్రీకరణ కోసమే దర్శకుడు శంకర్ 16 కోట్లు ఖర్చుతో శంషాబాద్ దగ్గర సెట్లు వేయించి మరీ చిత్రీకరించారనే వార్త ఆల్రెడీ హాట్ టాపిక్ గా మారింది.
ఎంతలేదన్నా కనీసం ఓ రెండు మూడు స్టెప్పులు, కియారా అద్వానీతో చరణ్ ఆడిపాడిన విజువల్స్ గట్టిగా పడితే తప్ప ఈ జరగండి జరగండి అంత సులభంగా రీచ్ తెచ్చుకోలేదు. తమన్ ట్యూన్ తన రెగ్యులర్ బాణీలో అనిపించడంతో పాటు జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చెనండీ అంటూ లిరిక్స్ రాయించడం పట్ల లీకైనప్పుడు కామెంట్స్ వచ్చి పడ్డాయి. వాటికి సమాధానం ఇవ్వడంతో పాటు శంకర్ టేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకునేందుకు దీన్ని మొదటి ప్రామాణికంగా తీసుకోబోతున్నారు ప్రేక్షకులు, బయ్యర్లు. సో ఆషామాషీగా ఉంటే లాభం లేదు. నెవర్ బిఫోర్ అనిపించుకోవాల్సిందే.
This post was last modified on October 26, 2023 11:53 am
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…